Social Media: భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తల పెత్తనం.. హైకోర్టు కీలక తీర్పు!

భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తలు పెత్తనం చెలాయించడం క్రూరత్వంతో సమానమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఓ విడాకుల కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం జీవిత భాగస్వామి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వాడకుండా చేయడాన్ని తప్పుపట్టింది.

New Update
Social Media: భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తల పెత్తనం.. హైకోర్టు కీలక తీర్పు!

Telangana High Court: భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తలు పెత్తనం చెలాయించడం క్రూరత్వంతో సమానమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఓ విడాకుల కేసులో జీవిత భాగస్వామిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండకుండా చేయడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు సోమవారం ఓ విడాకుల కేసును పరిశీలించిన హైకోర్టు.. వివాహ సందర్భంలోని క్రూరత్వం లక్షణాలను వివరించింది. భాగస్వామి ప్రతిష్టను, సామాజిక స్థితిని లేదా ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసేది ఏదైనా చర్య క్రూరత్వమేనని పేర్కొంది. అంతేకాకుండా జీవిత భాగస్వామిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండకుండా చేయడం కూడా క్రూరత్వానికి సమానమని కోర్టు స్పష్టం చేసింది.

ఆ వివాహా బంధాన్ని కొనసాగించడం అసాధ్యం..
హిందూ వివాహ చట్టం (హెచ్‌ఎంఏ) కింద విడాకులు కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ జరిపింది. అనంతరం 2 నవంబర్ 2021 నాటి మహబూబ్‌నగర్‌లోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వు నుంచి తీర్పు వెల్లడించింది.  1955లోని సెక్షన్ 13 (1) (i-a), (i-b) కింద విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే ఇష్టంలేని వ్యక్తుల వివాహా బంధాన్ని కొనసాగించడం సాధ్యం కాదని నొక్కి చెప్పింది. ప్రేమలేని వివాహంలో ఉండేందుకు ఇరువురిని బలవంతం చేయకూడదని సూచించింది.

అప్పీలుదారు (భర్త) ప్రతివాది (భార్య) డిసెంబర్ 1, 2010న హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ జంట డిసెంబర్ 4, 2010 నుంచి వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భార్య 2011న అత్తగారిళ్లు వదిలి భర్తకు దూరంగా ఉంటోంది. ఈ జంటకు ఒక బిడ్డ ఉంది. 2012లో భార్య ఫిర్యాదు చేయగా భర్త, అతని కుటుంబం 2012 ఆగస్టు 25న న ముందస్తు బెయిల్ పొందింది. అప్పీలుదారు మొదట 2012లో విడాకుల కోసం దాఖలు చేసినప్పటికీ అతను కేసును కొనసాగించలేదు. ప్రతివాది భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498-A కింద ఆరోపణలతో సహా అప్పీలుదారుపై ఐదు క్రిమినల్ కేసులను దాఖలు చేశారు. మే 2015లో క్లుప్తంగా తిరిగి కలుసుకున్నప్పటికీ, ప్రతివాది అప్పీలుదారుపై క్రిమినల్ ఫిర్యాదులను దాఖలు చేయడం కొనసాగించారని కోర్డు వివరించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

విషాదం.. సరదాగా పొలానికి వెళ్లిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే?

కరీంనగర్‌లో సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అత్తమ్మ వాళ్లు పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లి ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. ట్రాక్టర్‌తో పాటు చిన్నారి బావిలోకి దూసుకెళ్లడంతో మృతి చెందింది.

New Update
suryapet crime

Crime

సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మూడేళ్ల చిన్నారి అత్తమ్మ ఇంటికి సరదాగా వెళ్లింది. అత్తమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ఎక్కిస్తే నవ్వుతూ కూర్చొంది.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

ఒక్కసారిగా తాళం తిప్పడంతో..

ఆమెను ట్రాక్టర్ ఎక్కించిన తర్వాత అత్తమ్మ కొడుకును ఎక్కించడానికి పక్కకి వెళ్లారు. ఇంతలో ఆ మూడేళ్ల పాప ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. దీంతో ఆ చిన్నారితో పాటు ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి  కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.

ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.  అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు