/rtv/media/media_files/vgKfbvOxewFxFGh8czmj.jpg)
Trash Balloons : ఉత్తర కొరియా పంపించే చెత్త బెలూన్లను తొలుత చిన్న సమస్యగానే అనుకున్నప్పటికీ అది రానురాను దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారింది. ఆ బెలూన్ల కారణంగా జూన్ నుంచి తమ రాజధాని సియోల్ కు చెందిన రెండు విమానాశ్రయాల్లోని రన్ వే లను పలుమార్లు మూసేయాల్సి వచ్చిందని ఆ దేశ చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జూన్ 1 నుంచి ఇచియాన్, గింపో ఎయిర్ పోర్టుల్లో కొన్ని లేదా మొత్తం రన్ వేలను దాదాపు 20 రోజుల్లో మూసివేయాల్సి వచ్చిందని ఆ దేశ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు యంగ్ బూ నామ్ పేర్కొన్నారు. ఆ సమయంలో టేకాఫ్ లు, ల్యాండింగ్ లు సమస్మాత్మకంగా మారాయని తెలిపారు. మొత్తంగా ఆరు గంటలకు పైగా తమ వైమానికి సేవలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు.
ఇచియాన్ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఎయిర్ పోర్టుల్లో ఐదో స్థానంలో నిలుస్తుంది. మే చివరి వారంలో నుంచి ఉత్తరకొరియా వేల సంఖ్యలో చెత్త నింపిన బ్యాగ్ లు కట్టిన బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. తాజాగా వీటి సంఖ్య 5,500 దాటేసిందని అంచనా.
ఈ బుడగలు ఒక దేశాధ్యక్షుడి నివాస ప్రాంగణంలో కూడా ఈ చెత్త బెలూన్లు కూలి సంచలనం సృష్టించాయి. మరోసారి ఎయిర్పోర్ట్ రన్ వే పై పడటంతో అధికారులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఒక్క జూన్ 26 వ తేదీనే ఏకంగా ఇచియాన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రన్ వే ను దాదాపు మూడు గంటలు మూసివేయాల్సి వచ్చింది.
ఇదే ఎయిర్ పోర్టులో సోమవారం మరో 90 నిమిషాల అంతరాయం ఏర్పడింది. ఉత్తర కొరియా చెత్త బెలూన్ల కారణంగా ల్యాండింగ్ ఆలస్యం, మార్గం మళ్లింపు భయాలతో అత్యధిక ఇంధనాన్ని విమానాలు తీసుకెళ్లాల్సి వస్తోంది.
Also Read : జగన్కు రేవంత్ షాక్... కాంగ్రెస్లోకి ఆర్.కృష్ణయ్య!
India-China: ట్రంప్ టారిఫ్ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు
ట్రంప్ టారిఫ్ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.
Jai shankar
ట్రంప్ టారిఫ్ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్గాంధీ ఫైర్
ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .
Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్ల స్పందించారు. అమెరికా టారిఫ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు.
Also read: Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్
telugu-news | rtv-news
Urvashi Rautela: దబిడి దిబిడి భామకు గోల్డెన్ క్వీన్ అవార్డు..
BIG BREKING: రాజమండ్రిలో RGVపై మరో పోలీస్ కేసు..!
GT Vs RR: గుజరాత్ తొలి ఇన్నింగ్స్ పూర్తి.. రాజస్తాన్ టార్గెంట్ ఎంతంటే?
Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్ లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...
Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?