మాతో పెట్టుకుంటే విధ్వంసం తప్పదు.. కిమ్ అణ్వాయుధాలు హెచ్చరిక

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దక్షిణ కొరియాకి హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశంపై దక్షిణ కొరియా దాడి చేస్తే అణ్వాయుధాలతో విధ్వంసం సృష్టిస్తామని ఆ దేశ అధ్యక్షుడిని హెచ్చరించినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

New Update
kim

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దక్షిణ కొరియాకి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు క్షిపణులు, శక్తివంతమైన బాంబు పరీక్షలు, సూసైడ్ డ్రోన్ వంటి వాటిలో దేశ ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది. అయితే ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈక్రమంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తమ దేశంపై దాడి చేస్తే దక్షిణ కొరియాపై అణ్వాయుధాల దాడి చేస్తామని హెచ్చరించినట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చూడండి: ప్రతిరోజూ షేవ్ చేయడం ప్రమాదకరమా? చేస్తే ఏమవుతుంది.?

అమెరికాతో కలిసి..

శత్రు దేశాలు తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించేలా దాడులకు పాల్పడితే ఎలాంటి ఆలోచన లేకుండా అణ్వాయుధాలతో దేశంపై విరుచుకుపడతామని దక్షిణ కొరియాకి కిమ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఉత్తర కొరియా దాడి చేసిన వెంటనే ఆ దేశం పాలన ముగుస్తుందని.. అమెరికాతో కలిసి దాడి చేస్తామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ వాఖ్యానించారు. దీనికి బదులగా కిమ్‌ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: నేడు గాయత్రీ అవతారంలో దుర్గమ్మ.. ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

తాను పట్టుకున్న కుందేలుకు మూడ కాళ్ళు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎవరైనా తగ్గాల్సిందే కానీ తాను తగ్గేదే లే అంటున్నారు. తాజాగా చైనాపై ఏకంగా 104 శాతం సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుని..ఆ దేశానికి షాక్ ఇచ్చారు.  

New Update
tariffs

USA-China

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరి పోయింది.  చైనా వెనక్కు తగ్గకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ మూడు రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఆ దేశంపై విధిస్తున్న సుంకాలను 104 శాతం పెంచి భారీ షాక్ ఇచ్చారు. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ కార్యదర్శి ప్రకటించారు. 

ముందే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు..

రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనాపై 54 శాతం సుంకాలను విధింారు. దీనికి ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై ట్రపం మండిపడ్డారు చైనా తప్పు చేస్తోందని హెచ్చరించారు. ఏప్రిల్ 8లోగా సుంకాలను తగ్గించకపోతే 50శాతం పెంచుతామని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈరోజు చైనాపై ఏకంగా 104 శాతం మేర టారీఫ్ లను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

today-latest-news-in-telugu | usa | china | trump tariffs

Also Read: PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..

 

Advertisment
Advertisment
Advertisment