BIG BREAKING: భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు! వీడియో వైరల్

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. యుజింగ్ జిల్లాలో సోమవారం రాత్రి పలు సార్లు భూమి కంపించింది. భూకంపం దాటికి ఒక్కసారిగా ఇళ్లన్నీ కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

New Update
Japan Earth Quakes:జపాన్‌లో ఎందుకు ఎక్కువ భూకంపాలు వస్తాయి? కారణం ఇదే.

EARTH QUAKE

EARTH QUAKE: దక్షిణ తైవాన్‌లోని  యుజింగ్ జిల్లాలో  భారీ భూకంపం సంభవించింది. సోమవారం రాత్రి రిక్టర్ స్కేలుపై పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 27 మంది గాయపడినట్లు స్థానిక అధికారుల సమాచారం. కొన్ని చోట్ల ఇంటి పై కప్పులు కూలిపోవడం, ప్రజలు ఇళ్లల్లో చిక్కుకుపోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

అర్థరాత్రి భారీ భూకంపం 

అయితే సోమవారం రాత్రి ముందుగా 5. 1 తీవ్రతతో యుజింగ్ ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఆ తర్వాత మళ్ళీ అదే ప్రాంతంలో 4.8 తీవ్రతతో  భూమి కంపించింది. ఇక అర్థరాత్రి దాటిన తర్వాత 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. యుజింగ్‌ జిల్లాకు ఉత్తరాన 12 కి.మీ దూరంలో అర్ధరాత్రి 12:17 గంటలకు సంభవించిన ఈ భూకంపం దాటికి రాజధాని తైపీలో సైతం భవనాలు కంపించాయి. నాన్క్సీ  జిల్లాలో ఓ ఇల్లు కూలిపోగా.. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులతో సహా ఓ చిన్నారిని రెస్క్యూ టీమ్ కాపాడారు. 

Also Read: ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనా, ఆమె కూతురు, మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి.

New Update
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి  తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికార దుర్వినియోగంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనాతో పాటు 
ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరికొందరపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి హసీనాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.  

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

ఇక వివరాల్లోకి వెళ్తే.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, బ్రిటీష్ ఎంపీ తులిప్‌ రిజ్వానా సిద్ధిక్‌, మరో 50 మందిపై అవినీతి నిరోధక కమిషన్ బంగ్లాదేశ్‌ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై పరిశీలన చేసిన కోర్టు.. అరెస్టు వారెంట్లు జారీ చేసిందని పలు మీడియా కథనాలు తెలిపాయి. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసినట్లు చెప్పాయి. మరోవైపు అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై షేక్‌ హసీనా, ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరో 17 మందిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.   

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఢాకా శివారులో ఉన్న పుర్బాచల్‌లో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించిన అభియోగంపై ఏసీసీ తన దర్యాప్తు రిపోర్టును కోర్టుకు సమర్పించింది. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఢాకాలో ఇళ్లు ఉన్నప్పటికీ.. నివాసం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటం వల్ల ఇటీవల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.అయితే తాజాగా మరోసారి కోర్టు అరెస్టు వారెంట్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

 telugu-news | rtv-news | sheik-hasina | international

 

Advertisment
Advertisment
Advertisment