Priyanka Chopra: మంటల్లో ప్రియాంక చోప్రా ఇల్లు!.. లాస్‌ఏంజెలెస్‌లో ఆగని కార్చిచ్చు

లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇంకా ఆగడం లేదు. దీని ప్రభావం వల్ల మృతుల సంఖ్య 16కు చేరింది. మరోవైపు భారతీయ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా లాస్‌ ఏంజెలెస్‌లోనే ఉంది. ఇప్పుడు కార్చిచ్చు తన ఇంటిదగ్గరకు వచ్చేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update

లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇంకా ఆగడం లేదు. దీని ప్రభావం వల్ల మృతుల సంఖ్య 16కు చేరింది. ఎటోన్‌ ఫైర్ ప్రాంతంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ మరోవైపు గాలులు వేగంగా వీస్తున్నాయి. దీనివల్ల మంటలు ఒకచోట నుంచి మరోచోటుకి వేగంగా వ్యాపిస్తున్నాయి. పాలిసేడ్స్‌ ఫైర్‌ను 11 శాతం అదుపు చేశామని అధికారులు చెబుతున్నారు. అలాగే మంటలు బ్రెంట్‌వుడ్ వైపు మళ్లినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఆర్నాల్డ్, లిబ్రోన్ జేమ్స్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ లాంటి వారి ఇళ్లు కూడా ఉన్నాయి. ఎటోన్‌ ఫైర్‌లో మాత్రం మంటలు ఇంకా అదుపు కాలేదు. 

Also Read: సైనిక్ స్కూల్ 2025 ఎంట్రన్స్ అప్లికేషన్ లాస్ట్‌డేట్ ఇదే.. వెంటనే అప్లై చేయండి

మంటల్లో ప్రియాంక చోప్రా ఇల్లు

మరోవైపు భారతీయ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా లాస్‌ ఏంజెలెస్‌లోనే ఉంది. ఇప్పుడు కార్చిచ్చు తన ఇంటిదగ్గరకు వచ్చేసింది. ఇటీవలే ఆమె తన ఇంటికి సమీపంలో వ్యాపిస్తున్న మంటలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసి నాలుగు రోజులయ్యింది. ఈలోపే అక్కడ మంటలు వ్యాప్తి మరింత పెరిగిపోయింది. ఇప్పుడు కార్చిచ్చు తన ఇంటి వద్దకు వచ్చేసింది. మంటలను ఆపేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే పలువురు హాలివుడ్ సెలబ్రిటీల ఇళ్లు మంటల్లో దగ్ధమయ్యాయి.  

ప్రస్తుతం లాస్‌ఏంజెలెస్‌ మంటలను ఆర్పడం పెద్ద సవాలుగా మారింది. తగలబడిపోతున్న వేలాది ఇళ్లను కాపాడేందుకు నీటి కొరత ఏర్పడుతోంది. అయితే ఈ హలీవుడ్‌ స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ రేట్లు అదనంగా వాడుకొని తమ గార్డెన్లు పెంచుతున్నట్లు ఓ వార్తా కథనం తెలిపింది. 2022 నుంచి లాస్ ఏంజెలెస్‌లో నీటి వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఎవరైనా తమ గార్డెన్లకు నీరు పెట్టుకోవాలంటే వారానికి రెండుసార్లు 8 నిమిషాల పాటే వాడుకోవాలి. కానీ కొందరు కేటాయించిన నీరు కంటే అదనంగా వాడినట్లు అధికారులు గుర్తించారు. 

Also Read: మిలియన్ డాలర్ల లగ్జరీ బిల్డింగ్..బుగ్గిపాలు

మరోవైపు ఈ కార్చిచ్చు వెనుక కుట్రలు కూడా జరిగినట్లు వాదనలు వస్తున్నాయి. పప్ ఫిష్ అనే అరుదైన జాతి చేపలను రక్షించేందుకు కొన్నేళ్ల నుంచి కాలిఫోర్నియాకు నీటి సరఫరా తగ్గించున్నట్లు తెలుస్తోంది. ఈ చేపల కోసం దక్షిణ కాలిఫోర్నియాకు నీటి సరఫరా తగ్గించడం వల్లే ఇంతటి భారీ స్థాయిలో నష్టం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ సైతం ఆరోపిస్తున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Iran Nuclear Deal: సైనిక చర్యలు తప్పువు.. ఇరాన్ డీల్ పై ట్రంప్ మరోసారి..

ఇరాన్ తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డీల్ కు ఇరాన్ అంగీకరించకపోతే సైనిక చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇజ్రాయెల్ కూడా తమతో కలుస్తుందని అన్నారు. 

author-image
By Manogna alamuru
New Update
usa

USA Nuclear Deal With Iran

Iran Nuclear Deal: ఇరాన్ తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  దీనికి సంబంధించి ఈరోజు విలేఖరుల సమావేశంలో ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అణు ఒప్పందానికి అంగీకరించకపోతే సైనిక చర్యలు ఉంటాయా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..అవసరమైతే కచ్చితంగా చేస్తామని ఆయన అన్నారు. వారు న్యూ క్లియర్ డీల్ కు ఒప్పుకోకపోతే సైనిక చర్యలకు దిగుతామని చెప్పారు. ఇందులో ఇజ్రాయెల్‌ ప్రమేయం కూడా ఉంటుంది అని ట్రంప్ తెలిపారు. న్యూక్లియర్ డీల్ పై ఈ శనివారం ఒమన్ లో ట్రంప్ ఉన్నత స్థాయి చర్చలు చేయనున్నారు. 

నిరాకరిస్తే... దాడులు తప్పవు..!

ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్‌ నిరాకరిస్తే...బాంబుదాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదే విధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. అయితే ఇరాన్‌ తో పరోక్ష చర్చలకు అంగీకరిస్తారా? లేదా అనే దాని పై మాత్రం ట్రంప్‌ స్పష్టతనివ్వలేదు. కానీ ఇరాన్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్రకటన చేసింది. అమెరికాతో పరోక్ష ఉన్నతస్థాయి చర్చలు మాత్రమే ఉంటాయని తెలిపింది.  ట్రంప్‌ తొలి హయాంలో ఇరాన్‌ తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగాయి. 

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

మొదటి సారి ట్రంప్ అమెరికా  అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018 లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్‌ పై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్‌ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు.  అణుఒప్పందంపై ఇరాన్‌తో చర్చలు జరిపేందుకే ప్రాధాన్యం ఇస్తానని, ఎందుకంటే తాను ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదని ఆయన చెప్పారు. 

 today-latest-news-in-telugu | usa | iran | nuclear | deal

Also Read: China: స్నేహం కావాలి..అమెరికా దెబ్బకు చైనాకు భారత్ గుర్తొచ్చింది..

Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!

Advertisment
Advertisment
Advertisment