Mexico: మెక్సికోలో విషాదం.. బస్సు-ట్రక్కు ఢీ.. 41 మంది సజీవ దహనం

దక్షిణ మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారు తెలిపారు.

New Update
Fire accident Mexico

Fire accident Mexico

Mexico: దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు.  ప్రమాదంపై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ  దారుణం చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపించడంతో.. 38 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు బస్సు డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని,  ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు స్థానిక అధికారి వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA-China: ట్రంప్ కు చైనా షాక్..బోయింగ్ విమానాలు బంద్

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఒకరి మీద ఒకరు సుంకాలతో దాడులు చేసుకున్నారు ఇంతవరకూ. ఇప్పుడు చైనా ఏకంగా బోయింగ్ జెట్ విమానాల దిగుమతిని ఆపేసి ట్రంప్ కు షాక్ ఇచ్చింది. 

New Update
china

Boing Jets

అమెరికా, చైనాలు పగబట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ట్రంప్ మొదలెట్టిన వాణిజ్య యుద్ధం తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. మొన్నటి వరకు సుంకాలతో దాడులు చేసుకున్న రెండు దేశాలు ఇప్పుడు మరో అడుగు ముందు వేస్తున్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని చైనా ఎంత మాత్రం ఒప్పుకునేది లేదని చెబుతోంది. చర్చలకు తాము సిద్ధమంటూనే అమెరికాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా పెద్ద షాకే ఇచ్చింది చైనా. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే బోయింగ్ జెట్ విమానాలను ఆపేసింది. వాటిని డెలివరీ తీసుకోవద్దని చైనా ఎయిర్ లైన్స్ కు అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని బ్లూమ్ బర్గ్ న్యూస్ చెబుతోంది. అలాగే అమెరికన్‌ కంపెనీల నుంచి విమానాల విడిభాగాలు, పరికరాల కొనుగోలును కూడా ఆపేయాలని నిర్దేశించింది. 

మార్కెట్లు మటాష్..బోయింగ్ షేర్లు డౌన్..

అమెరికా టారీఫ్ లను విపరీతంగా పెంచేయడమే దీనికి కారణమని చైనా చెబుతోంది. దీంతో బోయింగ్‌ విమానాలను లీజుకు తీసుకుని విమానయాన సంస్థలకు ఆర్థికంగా ఊతమివ్వాలని చైనా యోచిస్తోంది. బోయింగ్ అమెరికాకు చెందిన అతిపెద్ద విమాన తయారీ సంస్థ. ఇందులో 30శాతం వరకూ చైనానే కొంటోంది. కానీ ఇప్పుడు సుంకాలు పెంచేయడంతో బోయింగ్ విమానాలు కానీ, వాటి విడి భాగాలు కానీ దిగుమతి చేసుకుంటే విమానయాన సంస్థలకు తడిసిమోపెడవుతోంది. తాజా చైనా నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ ను ప్రభావితం చేసింది. దీని కారణంగా బోయింగ్ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. 

today-latest-news-in-telugu | usa | china | donald trump tariffs | boing | airplanes

 

Also Read:  AP: మూడు సిటీలు కలిపి మెగా సిటీ..చంద్రబాబు మాస్టర్ ప్లాన్

 

Advertisment
Advertisment
Advertisment