Benjamin Netanyahu: ముగింపు కాదు.. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాను హెచ్చరించారు. యహ్యా సిన్వర్‌ మరణం ముగింపు కాదని.. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాలో బంధీలుగా ఉన్నవారిని వదిలిపెడితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని నెతన్యాహు పేర్కొన్నారు.

New Update
Benjamin Nethanyu

హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ అధినేత అయిన యహ్యా సిన్వర్‌ను ఇటీవల ఇజ్రాయెల్ హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాతో యుద్ధం ముగింపు కాదు..ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొన్నారు. హమాస్‌లోని సభ్యులు లొంగిపోవాలని, వారి దగ్గర ఉన్న బందీలని వదిలేస్తేనే సిన్వర్‌ మరణంతో యుద్ధానికి ముగింపు పలుకుతామని నెతన్యాహు గాజాను హెచ్చరించారు. గాజాలో బందీలుగా ఉన్న మా పౌరులు అందరూ తిరిగి వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటామని నెతన్యాహు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Infosys: రెండో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం.. ఎన్ని కోట్లంటే?

డీఎన్‌ఏ ఆధారంగా..

ఐడీఎఫ్ దళాల చేతిలో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందాడని ఇటీవల ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి తెలిపారు. అయితే గాజాలోని హమాస్ కమాండ్ సెంటర్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇందులో కమాండర్ సెంటర్ పూర్తిగా దెబ్బతింది. ఇందులోనే హమాస్ ఛీప్​ యహ్యా సిన్వార్ మృతి చెందారని తెలిపింది. అయితే ఆ దాడుల్లో ముగ్గురు మిలిటెంట్లు చనిపోయారని ఐడీఎఫ్ ప్రకటించింది. ఆ తర్వాత డీఎన్ఏ పరీక్షల తర్వాత యహ్యా చనిపోయడని తెలిపింది. అయితే ఈ విషయాన్ని కేవలం ఇజ్రాయెల్ మాత్రమే స్పష్టం చేసింది. దీనిపై హమాస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇది కూడా చూడండి: Sajjala ramakrishna reddy: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల

ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న దాడి చేశారు. ఈ ఘటనలో హమాస్‌ తీవ్రవాదులు 1200 మంది ఇజ్రాయెల్‌ ప్రజలను చంపారు. అప్పటి నుంచి సిన్వార్‌ కోసం ఇజ్రాయెల్‌ వేట మొదలుపెట్టింది. యాహ్యా అసలు పేరు యహ్యా ఇబ్రహీం హస్సన్‌ సిన్వార్‌. ఇతను 1962లో గాజాలోని ఖాన్‌ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో పుట్టాడు. సిన్వార్ పూర్వీకులు 1948 వరకూ ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్‌లో ఉండేవారు. ఆ తర్వాత సిన్వార్‌ కుటుంబం గాజాకు వెళ్లిపోయింది.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

ఇక యహ్యా గాజా విశ్వవిద్యాలయం నుంచి అరబిక్‌ స్టడీస్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. సిన్వార్‌20 ఏళ్ళ పాటూ పాటు జైల్లో గడిపాడు. 1982లో విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న నేరం మీ మొదటిసారి అరెస్టయ్యాడు. 1985లో జైలు నుంచి విడుదలై.. మరొకరితో కలిసి మజ్ద్‌ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పుడే కొత్తగా ఏర్పడ్డ హమాస్ లో ఇది కీలక విభాగంగా మారింది. పాలస్తీనా ఉద్యమంలో ఉంటూ.. ఇజ్రాయెల్ తో బంధాలు పెట్టుకొన్నవారిని హత్య చేసినట్లు మజ్ద్‌ అభియోగాలు ఎదుర్కొంది. ఆ ఆరోపణలతోనే 1988లో అరెస్ట్‌ కాగా.. 1989లో యహ్యాకు జీవిత ఖైదు విధించారు. 

ఇది కూడా చూడండి: Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment