/rtv/media/media_files/2026/03/30/mojtaba-khamenei-2026-03-30-11-18-27.jpg)
Mojtaba Khamenei
Mojtaba Khamenei: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉద్దేశించిన రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగనున్న ఈ కీలక చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తమ ప్రతినిధి బృందానికి అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగ శాఖ అంతకుముందు చర్చలను నిరాకరించినప్పటికీ, సోమవారం రాత్రి (ఏప్రిల్ 20) ఖమేనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చర్చలకు మార్గం సుగమమైందని 'ఆక్సియోస్' నివేదిక వెల్లడించింది.
Also Read: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు
14 రోజుల కాల్పుల విరమణ
మరోవైపు, ఇరాన్తో చర్చల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మంగళవారం ఉదయమే ఇస్లామాబాద్ బయలుదేరే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, గడువులోగా చర్చలు జరగకపోతే ఇరాన్పై భారీ బాంబు దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
Also Read: అనసూయపై అసభ్య పోస్టులు.. చంటి అరెస్ట్!
వాస్తవానికి, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ సోమవారం మాట్లాడుతూ.. అమెరికాతో చర్చలు జరిపే ప్రణాళిక ఏదీ లేదని స్పష్టం చేశారు. అమెరికా తన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడం లేదని ఆయన విమర్శించారు. అయితే, ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ (IRGC) ఒత్తిడి కారణంగానే ఇరాన్ ఈ చర్చలను జాప్యం చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో, ఈ శాంతి చర్చలు యుద్ధాన్ని నివారించడంలో ఎంతవరకు సఫలమవుతాయనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
Follow Us