US-Iran Deal : మిడిల్ ఈస్ట్ వార్‌లో పెను సంచలనం...వెనక్కి తగ్గిన ఇరాన్.. అమెరికాతో డీల్ ఖరారు!

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరదించేలా సంచలన పరిణామం చోటుచేసుకుంది. అణ్వాయుధ తయారీ ముంగిట నిలిచిన ఇరాన్.. అనూహ్యంగా ఒక అడుగు వెనక్కి తగ్గింది. అమెరికాతో చారిత్రాత్మక ఒప్పందానికి టెహ్రాన్ సిద్ధమైనట్లు శ్వేతసౌధ వర్గాలు ధృవీకరించాయి.

New Update
FotoJet - 2026-05-24T134550.809

US-Iran Deal

US-Iran Deal : US-Iran Deal :అమెరికాతో చారిత్రాత్మక ఒప్పందానికి (US-Iran Deal) టెహ్రాన్ సిద్ధమైనట్లు శ్వేతసౌధ వర్గాలు ధృవీకరించాయి. ఈ డీల్‌లో భాగంగా ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన 'శుద్ధి చేసిన యురేనియం' (Enriched Uranium) నిల్వలను వదులుకోవడానికి అంగీకరించడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది.త్వరలోనే ఇరాన్‌తో అధికారిక ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం స్వయంగా ప్రకటించారు.

 అమెరికా-ఇరాన్ చర్చల్లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన ప్రధాన ప్రతిష్టంభన యురేనియం నిల్వలపైనే. అయితే, అంతర్జాతీయ ఒత్తిళ్లు, వ్యూహాత్మక పరిణామాల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నివేదికల ప్రకారం.. ఇరాన్ వద్ద ప్రస్తుతం 60 శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలు ఉన్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఇరాన్ గనుక అనుకుంటే ఈ 60 శాతం నిల్వలను కేవలం కొద్ది వారాల్లోనే అణ్వస్త్ర తయారీకి అవసరమైన 90 శాతం స్థాయికి సులభంగా శుద్ధి చేయగలదు. ఈ నిల్వలతో 10 కంటే ఎక్కువ అణు వార్‌హెడ్లను (Nuclear Warheads) తయారు చేసే అవకాశం ఉంది.ఈ అత్యంత విలువైన, ప్రమాదకరమైన యురేనియం నిల్వల్లో ఎక్కువ భాగాన్ని ఇరాన్ తన 'ఇస్ఫహాన్ అణు కేంద్రం' (Isfahan Nuclear Facility) లోని భూగర్భ గదుల్లో అత్యంత సురక్షితంగా దాచినట్లు సమాచారం.

 ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ఇరాన్ తన ఎన్‌రిచ్డ్ యురేనియంను వదులుకోవడానికి ఒప్పుకున్నప్పటికీ, దాన్ని ఏం చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో మూడు రకాల చర్చలు నడుస్తున్నాయి: ఈ యురేనియం నిల్వలను సురక్షితంగా రష్యాకు తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. నేరుగా అమెరికాకు గానీ, లేదా ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలోని అంతర్జాతీయ కూటమికి గానీ అప్పగించడం. ఇరాన్ భూభాగంలోనే ఆ నిల్వలను తక్కువ ఎన్‌రిచ్‌మెంట్ స్థాయికి (అణ్వాయుధాలకు పనికిరాని విధంగా) మార్చడం. అధికారికంగా డీల్ పై సంతకాలు పూర్తయిన తర్వాతే ఈ నిర్వీర్య ప్రక్రియపై స్పష్టత రానుంది.

ఈ శాంతి చర్చల వెనుక పొరుగు దేశమైన పాకిస్థాన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పాక్ సైన్యానికి చెందిన ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ఇరాన్‌లో జరిపిన పర్యటన ఫలప్రదంగా ముగిసిందని, ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిర్చడంలో తమ రాయబారం విజయవంతమైందని పాక్ ఆర్మీ ప్రకటించింది. ఈ ఒప్పందానికి ప్రతిఫలంగా, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) పై తమకున్న హక్కులను గుర్తించాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ ప్రాంతంలో తిరిగి శాంతి నెలకొల్పడం, హార్ముజ్ మార్గాన్ని వాణిజ్యం కోసం పూర్తిగా తెరిపించడమే లక్ష్యంగా ఇరు దేశాలు పని చేస్తున్నాయి.

ఒకవైపు ఒప్పందం దాదాపు ఖరారైందని చెబుతూనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ గనుక ఈ చర్చల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా, లేదా ఒప్పందాన్ని ఉల్లంఘించినా మళ్లీ భీకర దాడులు చేస్తామని, యుద్ధం తప్పదని హెచ్చరించారు. శ్వేతసౌధం సమీపంలో తాజాగా జరిగిన కాల్పుల కలకలం నేపథ్యంలో అమెరికా భద్రతపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.ఏదేమైనా, ఇరాన్ తన అణు నిల్వలను వదులుకోవడానికి సిద్ధపడటం మిడిల్ ఈస్ట్‌లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఒక చారిత్రాత్మక ముగింపు కాబోతోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు