Pakistan: దారుణం.. పాలలో విషమిచ్చి 13 మంది హత్య పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. భూవివాదాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషం కలిపి హత్య చేయడం కలకలం రేపుతోంది. ఖైర్పూర్ సమీపంలోని బ్రోహీ అనే గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగింది. By Vishnu Nagula 15 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pakistan: పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. భూవివాదాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషం కలిపి హత్య చేయడం కలకలం రేపుతోంది. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహీ అనే గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు గుల్ బేగ్ బ్రోహి, అతని భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులుగా గుర్తించారు. కుటుంబ పెద్దకు ఆ గ్రామంలో కొంతమందితో భూ వివాదం ఉందని దర్యాప్తులో తేలింది. సకూర్లోని కెమికల్ లాబొరేటరీలో టెస్టులు చేయగా కుటుంబ సభ్యులు మరణించిన రోజు తాగిన పాలలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేలిదని పోలీసులు చెప్పారు. వారి మృతదేహాల్లో కూడా విషపదార్థాలు ఉన్నట్లు నివేదికలో నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని ఖైర్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ సమీవుల్లా సూమ్రో స్పష్టం చేశారు. #pakistan సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి