Inter Exams: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు..

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల కోసం ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు ఈ నెల 20తో ముగియనుంది. రూ.3500 ఫైన్‌కో ఫీజు చెల్లించొచ్చని ఇంటర్‌ బోర్టు డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

New Update
AP: విద్యార్థులకు అలర్ట్.. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ రిలీజ్..ఇలా డౌన్ లోడ్  చేసుకోండి..!

తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల ఫీజుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు ఈ నెల 20తో ముగియనుంది. రూ.3500 ఫైన్‌కో ఫీజు చెల్లించొచ్చని ఇంటర్‌ బోర్టు డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Also read: వ్యభిచార ముఠా అరెస్టు.. పోలీసుల అదుపులో అఖిల్ పహిల్వాన్

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్టియర్, సెకండియర్‌లకు సంబంధించి 10,59,233 మంది విద్యార్థులు వివిధ కాలేజీల్లో అడ్మిషన్లను పొందారు. వీరిలో 8,99,041 మంది విద్యార్థులు నిర్ణీత గడువులోపే పరీక్ష ఫీజులు చెల్లించగా.. ఫీజు చెల్లించని వారి కోసం ఫైన్‌తో కూడిన గడువు విధించారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఫస్టియర్‌ పరీక్షలు 2024 మార్చి 18 ముగియనుండగా.. సెకండియర్‌ పరీక్షలు మార్చి 19న ముగుస్తాయి.

ప్రధాన పరీక్షలు రెండు రోజుల ముందుగానే పూర్తవ్వనున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో కాస్త ముందుగానే ఇంటర్‌ వార్షిక పరీక్షలను నిర్వహించేలా ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించి విడుదల చేసింది. పరీక్షలు ఒక రోజు ఫస్టియర్‌ వారికి, మరో రోజు సెకండియర్‌ విద్యార్థులకు ఉంటాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే మూడు గంటల పాటు పరీక్ష సమయం ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించరు.

Also Read: రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి : భట్టి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment