Hyderabad: బస్సు టైర్ల కింద నలిగిపోయిన ఇంటర్ విద్యార్థిని.. వీడియో వైరల్!

హైదరాబాద్ యూసఫ్ గూడలో ఇంటర్ విద్యార్థిని ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోయింది. మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మెహరీన్ అనే యువతి కాలుజారీ పడిపోయిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Hyderabad: బస్సు టైర్ల కింద నలిగిపోయిన ఇంటర్ విద్యార్థిని.. వీడియో వైరల్!

Student Died in BUS Accident: హైదరాబాద్ నగరం నడిబొడ్డున్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ మేరకు యూసఫ్ గూడలోని (Yousufguda) మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మెహరీన్ అనే విద్యార్ధిని ఆర్టీసీ బస్ కోసం యూసఫ్ గూడ బస్టాండ్ వద్ద వేచి ఉంది. తను గమ్యం చేరుకునేందుకు వెళ్లాల్సిన బస్సు రావడంతో బస్సు రన్నింగ్ లో ఉండగానే ఎక్కడానికి ప్రయత్నించింది.

ఈ క్రమంలోనే అనుకోకుండా కాలు జారి బస్సు చక్రాల కింద పడిపోయింది. బస్సు తన మీది నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న మధురా నగర్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Also Read: భద్రాద్రి జిల్లాలో దారుణం.. 9 ఏళ్ల చిన్నారిపై ఫార్మసిస్ట్ ఉద్యోగి అత్యాచారయత్నం.!

Advertisment
Advertisment
తాజా కథనాలు