Jangareddygudem : జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన...!

జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి సమీపంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మగ నవజాత శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటుండగా..స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

New Update
Jangareddygudem : జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన...!

AP News : జంగారెడ్డిగూడెం (Jangareddygudem) ప్రభుత్వాసుపత్రి (Government Hospital) సమీపంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మగ నవజాత శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అప్పుడే పుట్టిన మగ నవజాత శిశువును స్థానిక ప్రభుత్వాస్పత్రి ఆవరణలో వదిలి వెళ్ళిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు.

ఆవరణలో ఉన్న శిశువును కుక్కలు పీక్కుతిన్నాయి. దీంతో బిడ్డ చనిపోయాడు. శిశువు మృతదేహాన్ని కుక్కలు రోడ్డు మీదకు లాగడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిశువుని ఎవరు వదిలివెళ్లిపోయారు.. ఎందుకు వదిలి వెళ్లారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Also read: వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు