అమెరికన్ల కంటే భారతీయులే మేలు..అమెరికా రాయబారి!

భారత్‌లో ప్రజాస్వామ్యంపై ఉన్న ఆందోళనలను అవసరం లేదని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. అమెరికన్ల కంటే భారతీయులు చాలా రకాలుగా మెరుగ్గా ఉన్నారని కూడా ఆయన అన్నారు.ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

New Update
అమెరికన్ల కంటే భారతీయులే మేలు..అమెరికా రాయబారి!

భారత్‌లో ప్రజాస్వామ్యంపై ఉన్న ఆందోళనలను అవసరం లేదని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. అమెరికన్ల కంటే భారతీయులు చాలా రకాలుగా మెరుగ్గా ఉన్నారని కూడా ఆయన అన్నారు.ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ, పదేళ్లలో భారతదేశం స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికల ఆధారంగా శక్తివంతమైన ప్రజాస్వామ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారతదేశంలో ప్రజాస్వామ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, అలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. ముఖ్యంగా భారత్‌లో ఎన్నికల నిర్వహణ తీరును ఎత్తిచూపుతూ.. ప్రజాస్వామ్యం పెరుగుతున్నదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. కొండ ప్రాంతంలో ఓ వ్యక్తి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లను, ప్రత్యక్షంగా చూసానని ఆయన ప్రస్తావించారు.

ఓటు వేయడానికి భారత ప్రజలు చూపుతున్న ఉత్సాహాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయానని అన్నారు. ఓట్ల కోసం డబ్బు చెల్లించకుండా నిరోధించడానికి వాహనాలను తనిఖీ చేస్తున్న వ్యక్తుల నివేదికలను తాను చూశానని ఎరిక్ గార్సెట్టి పేర్కొన్నాడు. అమెరికన్ల కంటే భారతీయులు చాలా రకాలుగా మెరుగ్గా ఉన్నారని గర్వంగా చెప్పారు.

ప్రజాస్వామ్య విలువలకు మద్దతివ్వడమే అమెరికా లక్ష్యమని, భారత్‌-అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు 21వ శతాబ్దాన్ని నిర్వచించే బంధంగా ఉంటాయని ఆయన నొక్కి చెప్పారు. భారత్‌తో సంబంధాలపై అమెరికాకు 100 శాతం విశ్వాసం ఉందని కూడా ఆయన అన్నారు. భారతదేశంలో పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల నిర్వహణ తీరుపై విదేశీ జోక్యంపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎరిక్ గార్సెట్టి అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment