Indian Student: అమెరికాలో ఏపీ విద్యార్థి దారుణ హత్య!

అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు విద్యార్థిని హత్య చేసి అడవిలో పడేయగా పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా ఆ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్‌ తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ గా గుర్తించారు.

New Update
AP: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. అప్పుడే అనంతలోకాలకు..!

America: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు విద్యార్థిని హత్య చేసి అడవిలో పడేయగా పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా ఆ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్‌ తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోస్టన్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్‌ (20) ను ఈ నెల 11న గుర్తు తెలియని వ్యక్తులు యూనివర్సిటీ క్యాంపస్‌ లోనే హత్య చేసినట్లు తెలుస్తుంది.

ఆ తరువాత అక్కడ నుంచి మృతదేహాన్ని అడవిలో పడేశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అభిజిత్‌ మృతదేహన్ని అధికారులు గుర్తించారు. అభిజిత్‌ మృతదేహన్ని శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం గ్రామానికి తరలించారు. ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారి రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అమెరికాలో భారత విద్యార్థులు చనిపోవడం గతేడాది నుంచి ఎక్కువవుతున్నాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన బిడ్డలు శవాలుగా తిరిగి వస్తుండడంతో ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కావడం లేదు.

Also read: ఈ రెండు విటమిన్ల లోపం వల్ల పిల్లలు పోషకాహార లోపం బారిన పడతారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు