Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లు రద్దు..!

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అలర్ట్. భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ పరిధిలో పలు ట్రైన్స్ రద్దు అయ్యాయి. డబుల్ డెక్కర్ ట్రైన్ ను కూడా రద్దు చేశారు. మరికొన్ని ట్రైన్స్‌ని రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు రైల్వే అధికారులు సంబంధిత వివరాలను వెల్లడించారు.

New Update
MMTS Trains: రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!

Indian Railways: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. భద్రతా పరమైన పనుల కారణంగానే ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఎస్‌సీఆర్ రద్దు చేసిన ట్రైన్స్‌లో ప్యాసింజర్‌ రైళ్లు సహా.. ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు కూడా ఉంది. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

రద్దైన రైళ్లు..

🚂 రాజమండ్రి - విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్‌ ట్రైన్ (07466)ను అక్టోబర్‌ 27, 28, 29 తేదీల్లో రద్దు చేశారు. ఇదే తేదీల్లో తిరుగు పయనమయయే ట్రైన్ (07467)ను కూడా రద్దు చేశారు.

🚂 విశాఖపట్నం - విజయవాడ మధ్య నడిచే డబుల్ డెక్కర్ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌(22701) ట్రైన్‌ను అక్టోబర్ 27, 28 తేదీల్లో రద్దు చేశారు రైల్వే అధికారులు. ఇదే తేదీల్లో తిరుగు ప్రయాణమయ్యే రైల్‌ను కూడా రద్దు చేయడం జరిగింది.

🚂 వీటితోపాటు అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

🚂 విశాఖపట్నం- కిరండూల్‌ (18514) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ కొరాపుట్‌ నుంచి తిరిగి ప్రయాణం అవుతుంది.

🚂 హౌరా - జగ్దల్‌పూర్‌ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ టిట్లాగఢ్‌ నుంచి హౌరాకు తిరిగి ప్రయాణం అవుతుంది.

🚂 భువనేశ్వర్-జగ్దల్‌పూర్‌ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) కొరాపుట్ నుంచి తిరిగి ప్రయాణం అయ్యి భువనేశ్వర్‌ చేరుతుంది.

ఇదికూడా చదవండి: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment