Income Tax Collections: ఇది షాకింగ్.. ఎక్కువ పన్ను కడుతున్నది కార్పొరేట్లు కాదు.. ఎవరంటే.. 

సాధారణంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఆదాయపు పన్ను ఎక్కువ వస్తుంది అని మనందరం అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. వ్యక్తిగత పన్ను వసూళ్లే ఎక్కువ. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన టాక్స్ లెక్కల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. 

New Update
Holidays: ఇన్ కమ్ టాక్స్ ఆఫీసులకు శని, ఆదివారాల్లో కూడా సెలవు లేదు.. ఎందుకంటే.. 

Income Tax Collections: మన దేశంలో ఎవరు ఎక్కువ టాక్స్ కడుతున్నారు? ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే.. ఇంచుమించుగా అందరి సమాధానం కార్పొరేట్ సెక్టార్ అని గబుక్కున చెప్పేస్తారు. మీరు కూడా అలానే అనుకుంటున్నారా? అయితే, అది పూర్తిగా తప్పు.  ప్రభుత్వ లెక్కలు కూడా అదే చెబుతున్నాయి.  గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, ఈ ఏడాది వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ల వృద్ధి రేటు కంటే కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్ల వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు సవరించిన అంచనాలో 80 శాతానికి పైగా అంటే రూ.15.50 లక్షల కోట్లు దాటడం. కార్పొరేట్ పన్ను వసూళ్లు, వ్యక్తిగత పన్నుల వసూళ్ల విషయాన్ని పరిశీలిస్తే రెండింటి వృద్ధి రేటులో భారీ వ్యత్యాసం ఉంది. టాక్స్ వసూళ్ల విషయంలో ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ ఎలాంటి గణాంకాలు(Income Tax Collections) విడుదల చేసిందో తెలుసుకుందాం. 

గ్రాస్ టాక్స్ కలెక్షన్ లెక్కలివే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు(Income Tax Collections) వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.15.60 లక్షల కోట్లకు చేరాయి. ఈ సేకరణ 2023-24కి సవరించిన అంచనాలలో 80 శాతం. ప్రత్యక్ష పన్నుల వసూళ్ల తాత్కాలిక గణాంకాల్లో నిరంతర పెరుగుదల నమోదవుతున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఒక ప్రకటనలో తెలిపింది. అటువంటి పరిస్థితిలో, ఫిబ్రవరి 10, 2024 వరకు ప్రత్యక్ష పన్ను స్థూల వసూళ్లు రూ.18.38 లక్షల కోట్లుగా చూపుతున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ మొత్తం 17.30 శాతంగా ఉంది. 

Also Read: మన యూపీఐ ఆ దేశాల్లోనూ అందుబాటులో.. ఎవరికి లాభం అంటే.. 

రీఫండ్‌లను మినహాయించిన తర్వాత ఎంత వచ్చిందంటే.. 
2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఫిబ్రవరి 10 వరకు రీఫండ్‌లను మినహాయించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు(Income Tax Collections) రూ. 15.60 లక్షల కోట్లుగా  ఉంది.  ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20.25 శాతం ఎక్కువ. ఈ సేకరణ 2023-24 ప్రత్యక్ష పన్నుల మొత్తం సవరించిన అంచనాలో 80.23 శాతం. ఏప్రిల్ 1, 2023 నుండి ఫిబ్రవరి 10, 2024 వరకు రూ. 2.77 లక్షల కోట్ల విలువైన రీఫండ్‌లను జారీ చేసినట్లు ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 

కార్పొరేట్ కంటే వ్యక్తిగతం ఎక్కువ..
కార్పొరేట్ ఆదాయపు పన్ను గణాంకాలను పరిశీలిస్తే, వీటిని వ్యక్తిగత ఆదాయపు పన్ను గణాంకాలతో (Income Tax Collections)పోల్చి చూస్తే.. ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. కార్పొరేట్ ఆదాయపు పన్ను అంటే CI వృద్ధి రేటు 9.16 శాతంగా ఉంది. అయితే వ్యక్తిగత ఆదాయపు పన్ను అంటే PIT వృద్ధి రేటు 25.67 శాతం. ఇప్పుడు దేశంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య పెరుగుతోందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కార్పొరేట్ పన్నుల వసూళ్ల వృద్ధి రేటు 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం. అంటే, ప్రస్తుతం భారతదేశంలో ఆదాయపు పన్ను వ్యక్తిగత విభాగం నుంచే వస్తోంది. 

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు