Summer: మండుతున్న సూర్యుడు.. మరో మూడు రోజులు బయటకు రావొద్దు..పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు 3 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.నేటి నుంచి మరో రెండు రోజుల పాటు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు

New Update
Summer: మండుతున్న సూర్యుడు.. మరో మూడు రోజులు బయటకు రావొద్దు..పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. గత వారం రోజుల నుంచి సూర్యుడు తన ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు. రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు 3 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

నేటి నుంచి మరో రెండు రోజుల పాటు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు. గురువారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. రానున్న మూడు రోజుల పాటు వాతావరణశాఖ అధికారులు మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఇదిలా ఉంటే ద్రోణి ఒకటి దక్షిణ విదర్భ నుంచి మరాఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. ద్రోణి మన్నార్ గల్ఫ్ నుండి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని వివరించింది. దీంతో మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2015, 2016 సంవత్సరాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆ సమయంలో అనేకమంది మృత్యువాత పడ్డారు. మళ్లీ ఇప్పుడు అంత తీవ్రమైన ఎండలు వేస్తూండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్‌ బారిన పడకుండా ఉండేందుకు పళ్లరసాలు, ఓఆర్ఎస్‌ ద్రావణాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also read: కొత్తిమీర నీటితో మధుమేహనికి చెక్‌ పెట్టొచ్చు..ఎలా తీసుకోవాలో తెలుసుకుందామా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala High Alert :  పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు.

New Update
Tirumala High Alert

Tirumala High Alert

Tirumala High Alert :  జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
కొండపై సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు  టీటీడీ వెల్లడించింది. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను, భక్తులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీని సైతం వదలకుండా తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలలోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నిఘవర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమలలో కూడా భద్రత కట్టుదిట్టం చేసింది.

 

 


 Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వచ్చే రెండు మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు నడకమార్గం ఉంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి సప్తగిరి చెకింగ్ పాయింట్ దగ్గర తనిఖీలు చేస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో వెళ్లే భక్తుల లగేజీని కూడా చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండటం, కాశ్మీర్ ఉగ్రదాడితో తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారు.. దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో తిరుమలలో భద్రతలను కట్టుదిట్టం చేశామన టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే
 
మరోవైపు ఆక్టోపస్‌ దళం కూడా అప్రమత్తమైంది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి.. భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆక్టోపస్ టీమ్ తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భ‌ద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరిస్తారు. గతేడాది మార్చిలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే తిరుమల ఆలయం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.. 24 గంటలు సాయుధ బలగాల పహారాలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. మొత్తం మీద కాశ్మీర్ ఉగ్రదాడి ప్రభావం తిరుమలపై కూడా కనిపించింది.. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment