ఐఐటీ విద్యార్థి మిస్సింగ్‌ మిస్టరీ విషాదం!

హైదరాబాద్‌ ఐఐటీ మిస్సింగ్‌ మిస్టరీ విషాదంగా ముగిసింది. కనిపించకుండా పోయిన విద్యార్థి కార్తీక్‌ విశాఖ బీచ్‌ లో శవమై తేలాడు. జులై 17 రాత్రి నుంచి కార్తీక్‌ కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు..కార్తీక్‌ వైజాగ్‌ వెళ్లినట్లు గుర్తించారు.

New Update
ఐఐటీ విద్యార్థి మిస్సింగ్‌ మిస్టరీ విషాదం!

హైదరాబాద్‌ ఐఐటీ మిస్సింగ్‌ మిస్టరీ విషాదంగా ముగిసింది. కనిపించకుండా పోయిన విద్యార్థి కార్తీక్‌ విశాఖ బీచ్‌ లో శవమై తేలాడు. జులై 17 రాత్రి నుంచి కార్తీక్‌ కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు..కార్తీక్‌ వైజాగ్‌ వెళ్లినట్లు గుర్తించారు.

iit student missing case tragic end

ఈ క్రమంలోనే సోమవారం కొందరు స్థానికులు వైజాగ్‌ బీచ్‌ లో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఆ మృతదేహం ఐఐటీ విద్యార్థి కార్తీక్‌ దిగా గుర్తించారు. దీంతో వారు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చేతికి అందివచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు కార్తీక్‌ డెడ్‌ బాడీని విశాఖ జీజీహెచ్‌ కు తరలించినట్లు పోలీసులు వివరించారు. కార్తీక్‌ ఆత్మహత్య పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థి కార్తీక్‌ ది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. సంగారెడ్డి కంది ఐఐటీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే కార్తీక్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. సెకండ్‌ ఇయర్‌ లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవ్వడం వల్లే కార్తీక్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. పరీక్షల్లో తప్పడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Husband: భార్యపై అనుమానంతో సుత్తితో కొట్టి చంపిన భర్త

నోయిడాలో భార్య మీద అనుమానంతో నూరుల్లా హైదర్ ఆమెను సుత్తితో కొట్టి చంపాడు. వారికి 2005లో పెళ్లి కాగా.. ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉద్యోగం పోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. భార్యకు ఆఫీస్‌లో వివాహేతర సంబంధం ఉందని హైదర్ అనుమానంతో ఈ పని చేశాడు.

New Update
man kill his wife

man kill his wife Photograph: (man kill his wife)

భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను చంపేశాడు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నూరుల్లా హైదర్(55)కు 2005లో అస్మా ఖాన్‌తో వివాహమైంది. వీరికి బీటెక్ చదువుతున్న ఓ కుమారుడు, 8వ తరగతి చువుతున్న ఓ కుమార్తె ఉంది. నోయిడాలోని సెక్టార్ 15లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. భార్య అస్మా ఖాన్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది.  ఆమె గతంలో ఢిల్లీలో నివసించింది. ఆమె భర్త జామియా మిలియా ఇస్లామియా నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్. ప్రస్తుతం అతను కూడా ఓ ప్రైవేట్ ఎంప్లాయి.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Also read: Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

అస్మాఖాన్‌ సెక్టార్ 62లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నూరుల్లా హైదర్ ఉద్యోగం పోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అస్మాఖాన్‌కు వివాహేతర సంబంధం ఉన్నదని నూరుల్లా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై రోజూ ఆమెతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి కూడా అదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో సుత్తి తీసుకుని అస్మా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని వారి కుమారుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment