Accident : హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెగిపడిన తల, మొండెం! శంషాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొట్టడంతో తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డాయి. ఈ సంఘటన శంషాబాద్ సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని ఊటుపల్లికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. By Archana 07 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Car Accident : శంషాబాద్ (Shamshabad) మున్సిపల్ పరిధి తొండుపల్లి సమీపంలోని ఓఆర్ఆర్ (ORR) పై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు డీకొట్టింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఎగిరి కారు అద్దంపై పడడంతో తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డాయి. మృతి చెందిన వ్యక్తిని ఊటుపల్లికి చెందిన తోట్ల అంజయ్య(65)గా గుర్తించారు. అంజయ్య ఒక రోజువారీ కూలి. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అంజయ్య ఈ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. అంజయ్య ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తుక్కుగూడ వైపు బయల్దేరాడు. మధ్యలో తొండుపల్లి కూడలి వద్ద ఓఆర్ఆర్ దాటుతుండగా.. గచ్చిబౌలి నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అంజయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. తల బలంగా కారు అద్దానికి తాకడంతో అద్దం పగిలి.. మెడ కోసుకుపోయి తల సీటు లోపల.. మొండెం రోడ్డుపై పడ్డాయి. ఈ హృదయ విదారక ఘటన అందరి మనసుల్ని కలచివేస్తుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. Also Read: Kavya Thapar : 'ఇస్మార్ట్ శంకర్' లో నేనే హీరోయిన్ గా చేయాల్సింది.. ఆడిషన్స్ కు కూడా వెళ్ళా, కానీ.. - Rtvlive.com #hyderabad #telangana #shamshabad-road-accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి