Heat : బాబోయ్ ఏం ఎండలు రా ఇవి... తట్టుకోలేకపోతున్నాం..వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు!

ఎండల వేడి తార స్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండలు ఇలాగే తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో చాలా చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి

New Update
Heat Alert: దేశంలోని పలు ప్రాంతాల్లో 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..రెడ్‌ అలర్ట్ జారీ!

Telangana : తెలంగాణలో ఎండలు(Heat) రోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరం మే చివరి వారంలో నమోదు అయిన ఉష్ణోగ్రతలు(Temperatures)..ఈ ఏడాది మే మొదటి వారంలోనే నమోదు అవుతున్నాయి. సూర్యుడు రోజురోజుకి తన ప్రతాపాన్ని చూపించి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. ఆదివారం జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 47.1 డిగ్రీ సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

అంతేకాకుండా జగిత్యాల లోని కొన్ని ప్రాంతాల్లో 46.8, అల్లీపూర్‌ లో 46.7, కరీంనగర్‌ లో 46.7 ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ విభాగం తెలిపింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఎండల వేడి తార స్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండలు ఇలాగే తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ(IMD) హెచ్చరించింది. దీంతో చాలా చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో వడగాల్పులు కూడా తీవ్రంగా వీచే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

అయితే రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ...పలుచోట్లు తేలిక పాటి నంఉచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు వివరించారు. మంగళ, బుధ, గురు వారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని అధికారులు వివరించారు.

దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఆదివారం కాసిన ఎండవేడి తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి. దీంతో మత్స్యకారులు రోడ్డున పడి తీవ్రంగా నష్టపోయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చేపలను రక్షిచుకునేందుకు బోరు మోటారు సహాయంతో చెరువులోకి నీటి వదులుతున్నారు.మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్ట పరిహారం అందిచాలని వేడుకుంటున్నారు.

Also read: ఆరోగ్య నిధి గుమ్మడి గింజలు..వీటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HIT 3 Censor Report: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

నాని నటించిన "హిట్ 3" సినిమా సెన్సార్ బోర్డు నుండి 18+ సర్టిఫికెట్‌ పొందింది. ఇది పిల్లలు, సున్నిత మనస్కులు చూడలేని యాక్షన్, రక్తపాతం, బూతులు ఉన్న చిత్రం కాగా, మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.

New Update
HIT 3 Sencor Report

HIT 3 Censor Report

HIT 3 Censor Report: నానికి(Nani) టాలీవుడ్‌లో యూత్ ఆడియన్స్ నుండి ఫ్యామిలీస్ వరకూ అందరి నచ్చే హీరోగా మంచి పేరుంది. అయితే, కొంత కాలంగా అన్ని యాక్షన్ మూవీస్ చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా, నాని నటించిన 'హిట్ 3' మూవీకి సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ నుండి 18+ సర్టిఫికెట్ పొందింది. అంటే పిల్లలు, సున్నిత మనస్కులు ఈ చిత్రాన్ని చూడలేరు. 

Also Read: "క్రిష్ 4" లో ప్రియాంక చోప్రా ఫిక్స్..

18+ సర్టిఫికెట్..

గతంలోనే నాని ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు, ఈ మూవీ అవుట్ అండ్ ఔట్  వియోలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుంది, పిల్లలు ఈ మూవీని చూడకూడదని అని చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో కూడా అదే జరిగింది. "హిట్ 3" టీజర్ లో కూడా రక్తపాతంతో ఉండగా, సినిమా కంటెంట్ లో కూడా అలాంటి దృశ్యాలు ఉన్నాయని, సెన్సార్ వాటిని బ్లర్ చేయమని సూచించిందట. ఈ సినిమా పైన అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాల్లోని బూతులు, రక్తపాతం కారణంగా సెన్సార్ బోర్డ్ నుండి 18+ సర్టిఫికెట్ పొందింది. 

Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

ఈ చిత్రంలో నాని పోలీస్ పాత్రలో నటిస్తుండగా, శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్ల లో భాగంగా ట్రైలర్ సోమవారం ఉదయం విడుదల చేసారు.

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

Advertisment
Advertisment
Advertisment