China Earthquake: చైనాలో భారీ భూకంపం...వందకు పైగా మృతి, చాలా మందికి గాయాలు..!!

చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సోమవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది చైనాలోని లాంజోకు నైరుతి దిశలో 102 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. వందకు పైగా మృతిచెందారు.

New Update
China Earthquake: చైనాలో భారీ భూకంపం...వందకు పైగా  మృతి, చాలా మందికి గాయాలు..!!

సోమవారం అర్థరాత్రి చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో బలమైన భూకంపం సంభవించింది. చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ (సిఇఎన్‌సి) ప్రకారం, భూకంప కేంద్రం చైనాలోని లాంజోకు నైరుతి దిశలో 10 కిమీ లోతులో 102 కి.మీ ఉన్నట్లు గుర్తించారు. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సోమవారం రాత్రి 23:59 గంటలకు బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు వందకు పైగా మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.

భూకంపం గురించి సమాచారం ఇస్తూ, చైనా యొక్క అత్యవసర నిర్వహణ విభాగం, భూకంపం యొక్క తీవ్రత చాలా బలంగా ఉందని.. దీని కారణంగా చాలా భవనాలు కూలిపోయాయని చెప్పారు. భూకంపం తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది శిథిలాల కింద కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.భూకంపం తాకిడికి చాలా ఇళ్లు కూలిపోయాయి. మరికొన్నింటికి బీటలు వచ్చాయి. ప్రజలకు సోమవారం రాత్రి కాళరాత్రిలా మారింది. వేలాది మంది రాత్రంతా నిద్రలేకుండానే రోడ్లపై, వీధుల్లో ఉన్నారని రాష్ట్ర న్యూస్ ఏజెన్సీ తెలిపింది. చాలా చోట్ల, నీరు, కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. ఘటనపై స్పందించిన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్..సహాయ చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భూమి లోపల 7 ప్లేట్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఢీకొనే జోన్‌ను ఫాల్ట్ లైన్ అంటారు. పదేపదే ఢీకొనడం వల్ల ప్లేట్ల మూలలు వంగి ఉంటాయి. చాలా ఒత్తిడి పెరిగినప్పుడు, ప్లేట్లు విరిగిపోతాయి. దిగువ శక్తి బయటకు రావడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. భంగం తర్వాత భూకంపం సంభవిస్తుంది.భూమిలోపల పొరల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్లే ఈ భూకంపం వచ్చిందనే అంచనాలు ఉన్నాయి. భూకంపానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: భయపెడుతున్న తుఫాన్..ఏపీ, తెలంగాణలో భారీ వర్షం పడుతుందా? చలి పెరుగుతుందా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment