Breaking: ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి..22 మందికి పైగా గాయాలు..మృతుల్లో చిన్నారులు!

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలోని కతియా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా..23 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ఆగి ఉన్న మసాదా కారును డీఐ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

New Update
Breaking: ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి..22 మందికి పైగా గాయాలు..మృతుల్లో చిన్నారులు!

Accident: ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలోని కతియా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా..23 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ఆగి ఉన్న మసాదా కారును డీఐ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ వాహనంలో 40 నుంచి 50 మంది వరకు ప్రయాణికులున్నారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, ప్రజలందరూ సమాధిన్ మీటింగ్ కార్యక్రమానికి తిరయ్య గ్రామం నుండి తిరిగి వస్తుండగా, కతియా గ్రామంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మహిళలు మరణించినట్లు సమాచారం.

మృతులంతా పత్ర గ్రామ వాసులుగా అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారందరినీ బెమెతర జిల్లా ఆసుపత్రి, సిమ్గా ఆరోగ్య కేంద్రంలో చేర్చారు, అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Also read: కేజ్రీవాల్‌ తో భార్య ములాఖత్‌ రద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు