Pithapuram : పిఠాపురంలో హై ఓల్టేజ్.. అటు మెగా పవర్ స్టార్.. ఇటు జగన్ సర్కార్..! ఏపీలో పిఠాపురం హాట్ సీటుగా మారింది. సీఎం జగన్ చివరి ప్రచారం పిఠాపురంలో నిర్వహించనున్నారు. మరోవైపు, పవన్ కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్లనున్నారు. తల్లి సురేఖతో కలిసి కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. By Jyoshna Sappogula 11 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Mega Power Star : ఏపీ(Andhra Pradesh) లో పిఠాపురం హాట్ సీటుగా మారింది. జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పోటీ చేస్తుండడంతో అందరి ఫోకస్ ఈ నియోజకవర్గంపైనే ఉంది. పిఠాపురాన్ని టార్గెట్ చేసిన సీఎం జగన్(CM Jagan) చివరి ప్రచారం ఇక్కడే నిర్వహించనున్నారు. మరోవైపు పవన్ కు మద్దతుగా పిఠాపురానికి వెళ్లనున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). తల్లి సురేఖతో కలిసి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పిఠాపురానికి వెళ్లనున్నారు. అక్కడ స్థానిక కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. Also Read: వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు.. మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్..! అయితే, ఇప్పటికే పవన్కు మెగా ఫ్యామిలీ మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. పవన్ ను గెలిపించాలంటూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. నాగబాబు దంపతులు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. ఇలా కుటుంబంలోని అందరు పిఠాపురంలో పవన్ కోసం ప్రచారం చేశారు. ప్రచారానికి ఇవాళ చివరి రోజు కావడంతో బాబాయ్ తరపున.. అబ్బాయ్ ప్రచారం చేస్తారా? లేదా? అని ఉత్కంఠ నెలకొంది. #andhra-pradesh #cm-jagan #ram-charan #pithapuram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి