Summer Skin Tips: వేసవిలో చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకునే చిన్న చిట్కాలు

వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మహిళలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చర్మాన్ని తేమగా ఉంచడానికి నీరు అధికంగా ఉండే పండ్లను తినాలని నిపుణులు అంటున్నారు. చర్మానికి అదనపు సంరక్షణ కోసం చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Summer Skin Tips: వేసవిలో చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకునే చిన్న చిట్కాలు

Summer Skin Tips: వేసవిలో చర్మంపై అనేక రకాల సమస్యలు వస్తాయి. అయితే ఈ సమయంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని నేచురల్ పద్ధతులను అవలంబిస్తే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల వేసవిలో కూడా చర్మ సౌందర్యం చెక్కుచెదరకుండా ఉంటుంది. మండుటెండలో తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మహిళలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.

publive-image

చర్మానికి అదనపు సంరక్షణ అవసరం. ఈ సీజన్‌లో చెమట, దుమ్ము, కాలుష్యం కారణంగా అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. చర్మం తేమను కంట్రోల్‌ చేయడానికి ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో ఒక చెంచా తేనె తీసుకుని దానికి రోజ్ వాటర్ కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోండి. తర్వాత ఫేస్ సీరమ్ అప్లై చేయండి. చర్మాన్ని తేమగా ఉంచడానికి నీరు అధికంగా ఉండే పండ్లను తినాలి.

publive-image

ఎక్కువ తియ్యగా ఉన్నవాటిని తినకూడదు. చర్మంపై తేమను కంట్రోల్‌ చేయడానికి జెల్ రాయండి. ఇంట్లో ఈ జెల్ సిద్ధం చేయవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో ఒకటి లేదా రెండు చెంచాల విటమిన్ ఇ క్యాప్సూల్, అలోవెరా జెల్ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. మరీ జిగటగా అనిపిస్తే కొంత సమయం తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. అంతేకాకుండా వేసవిలో చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. రోజుకు 2 లీటర్ల నీరు తాగితే ముఖం చికాకు, దద్దుర్లు, మొటిమలను నివారించవచ్చు.

ఇది కూడా చదవండి: సమ్మర్‌లో పెళ్లి కూతురికి మేకప్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bharat Bhushan: మూడేళ్ల చిన్నారి ఉందన్న వదల్లేదు.. మూడు నిమిషాలు పాటు కాల్చి కాల్చి!

ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు కోల్పోయాడు. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

New Update
 Bharat Bhushan

Bharat Bhushan

పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బాధితులు కాళ్లు పట్టుకుని, చేతులెత్తి దండం పెట్టిన వదల్లేదు. ఈ ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు  కోల్పోయాడు. అందరినీ కాల్చేస్తూ ఓ ఉగ్రవాది తమ వద్దకు రాగా.. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

దయచేసి నన్ను వదిలేయండి

భరత్ భూషణ్ భార్య సుజాత భూషణ్ ప్రముఖ డాక్టర్. ఈ దంపతులకు మూడేళ్ల చిన్నారి ఉంది. బెంగళూరులో స్థిరపడిన వీరంతా 2025 ఏప్రిల్ 18న విహారయాత్ర కోసమని కశ్మీర్ వెళ్లారు. ఏప్రిల్ 23న బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి ఉండగా.. మంగళవారం మధ్యాహ్నం పహల్గాం సమీప ప్రాంతానికి వెళ్లి అక్కడ సరదాగా తమ చిన్నారితో గడిపారు.  అప్పుడు అకస్మాత్తుగా  కాల్పలు శబ్ధాలు రావడంతో వెంటనే  ముగ్గురం పక్కనే ఉన్న గుడారాల వెనుక దాక్కున్నారు. ఇది గమనించిన ఓ ఉగ్రవాది తమ దగ్గరికి వచ్చాడని సుజాత తెలిపారు. తన  భర్త ఆ ఉగ్రవాదిని ‘‘నాకు ఒక బిడ్డ ఉంది. దయచేసి నన్ను వదిలేయండి’ అని అడిగాడు. అయినప్పటికీ ఆ ఉగ్రవాది కనికరించలేదు. తన భర్త తలపై కాల్చి చంపి వెళ్లిపోయాడంటూ సుజాత కన్నీటి పర్యాంతమైంది.  

Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

పహల్గామ్ దాడి జమ్మూ కాశ్మీర్‌లో ఆరు సంవత్సరాలలో జరిగిన అత్యంత దారుణమైనది, 2019 ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలో 40 మంది సైనికులు హత్యకు గురైన తర్వాత ఇదే అత్యంత దారుణమైనది. అమాయకపు టూరిస్టులపై దాడులకు పాల్పడిన ఏ ఒక్క డగ్రవాదిని కూడా వదిలిపెట్టబోమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు