Rains: వరుసగా 5 రోజులు వానలే వానలు...ఆ ప్రాంతాల్లో జోరుగా పడే ఛాన్స్‌!

హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.రానున్న ఐదు రోజుల పాటు అంటే బుధవారం నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
Telangana : రాష్ట్రంలో రాగల నాలుగురోజులు వర్షాలే.. వర్షాలు!

Rains: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ముందుగానే వచ్చాయి. ఈ క్రమంలోనే భారీ వర్షాలు కురుస్తాయని వాతావవరణశాఖాధికారులు తెలిపారు.దానికి తగినట్లుగానే జూన్‌ ప్రారంభం నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.రానున్న ఐదు రోజుల పాటు అంటే బుధవారం నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు. అలాగే గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వ్యవసాయం, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ కాలం కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు పడుతున్నాయి.

Also read: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Posani Krishna Murali: పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?

పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని మళ్లీ అరెస్ట్ అవుతారన్న చర్చ మొదలైంది.

New Update

సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ పోలీసులు మరో బిగ్‌ షాక్‌ ఇచ్చారు. తాజాగా పోసానిపై మరో కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సుళ్లూరుపేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశించారు. నిన్న సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్న సమయంలో ఈ నోటీసులు అందించారు. పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే కపలు కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఫిబ్రవరిలో అరెస్ట్..

చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ అభియోగాలతో ఫిబ్రవరి 26న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లో పోలీసులు హైదరాబాద్ లోని పోసాని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 16 కేసులు ఆయనపై నమోదయ్యాయి. సీఐడీ కూడా ఆయనను అదుపులోకి తీసుకుని విచారించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో మార్చి 22న పోసాని గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. కానీ నో రిలీజ్

నెల రోజులకు పైగా జైల్లో..

దాదాపు నెల రోజులకు పైగా ఆయన ఈ కేసుల్లో జైల్లో ఉన్నారు. కేసు గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడవద్దని.. రూ.2 లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలని బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు పోసానికి స్పష్టం చేసింది. నాలుగు వారాల పాటు ప్రతీ మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు మంగళగిరి లోని ఏపీ సీఐడీ ఆఫీసుకు వచ్చి సంతకం చేయాలని స్పష్టం చేసింది. 

(posani krishna murali arrest | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment