Guava Leaves Tea : శీతాకాలంలో వచ్చే సమస్యలకు ఈ ఆకుల టీతో చెక్‌ పెట్టొచ్చు తెలుసా!

శీతాకాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు అయినటువంటి జలుబు, దగ్గు, అజీర్ణం వంటి సమస్యలకు జామ ఆకుల టీ తో చెక్‌ పెట్టవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుందని వివరిస్తున్నారు.

New Update
Guava Leaves Tea : శీతాకాలంలో వచ్చే సమస్యలకు ఈ ఆకుల టీతో చెక్‌ పెట్టొచ్చు తెలుసా!

Winter Season : శీతాకాలం(Winter) వచ్చేసింది. తనతో పాటు ఎన్నో రకాల రోగాలను(Health Issues) కూడా వెంటపెట్టుకుని తీసుకుని వచ్చేసింది. అసలు చలికాలం మొదలైంది అంటేనే జలుబు(Cold) , దగ్గు(Cough) ఇలా రకరకాల అనారోగ్య సమస్యలతో మనం సతమతం అవుతుంటాం. అందుకే చలికాలం మొదలు అయినప్పటి నుంచి కూడా తినే ఆహారం విషయం లో కానీ, ఆరోగ్యం విషయం లో కానీ అనేక విషయాల్లో మనం అప్రమత్తంగా ఉండాలి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదోక సమస్య మనల్ని వేధిస్తూనే ఉంటుంది. అందుకే ఈ కాలంలోనే కాకుండా అన్ని కాలాల్లో కూడా వేడి పదార్థాలను తీసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఈ కాలంలో ముఖ్యంగా జామాకు టీ(Guava Leaves Tea) తీసుకోవడం వల్ల శీతాకాలంలో వచ్చే అనేక వ్యాధులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.

ప్రతి రోజూ ఉదయాన్నే ఈ టీని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి(Immunity Power) పెరుగుతుంది. జామాకులలో ఉండే విటమిన్‌ సి అధిక స్థాయిలో ఉంటుంది. అందువల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడం తో పాటు శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్‌ లతో పోరాడటానికి ఇందులో ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

దీనిని నిత్యం తీసుకోవడం వల్ల ఈ కాలంలో ఏర్పడే గొంతు మంట తగ్గడంతో పాటు ఈ కాలంలో ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలైనటువంటి దగ్గు, జలుబు సమస్యలు పూర్తిగా తగ్గుతాయని నిపుణులు వివరిస్తున్నారు. అంతేకాకుండా చలికాలంలో అందరూ ప్రధానంగా ఎదుర్కొనే సమస్య అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు బాధపెడుతుంటాయి.

జామాకుల్లో యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుల టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్‌ కూడా కంట్రోల్‌ అవుతుందని చెప్పవచ్చు. విటమిన్‌ సి అధికంగా ఉండడం వల్ల చర్మ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి.

Also read: చలికాలంలో మీ రిఫ్రిజిరేటర్ సేఫ్ గా ఉండాలంటే.. ఈ టెంపరేచర్లో ఉంచండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

గతేడాది వరదల్లో వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని చనిపోయారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు పెట్టి గౌరవించింది. ఆమె తండ్రితో వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ ఆఖేరు వాగు వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

New Update
scientist ashwini

scientist ashwini

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. 

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Advertisment
Advertisment
Advertisment