HCA Elections: HCA ఎన్నికల ఫలితాలు.. కొత్త ప్రెసిడెంట్‌ ఎవరంటే?

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA)కు కొత్త ప్రెసిడెంట్‌ రానున్నారు. HCA ఎన్నికల ఫలితాలు విడుదలవగా.. కొత్త ప్రెసిడెంట్‌గా జగన్ మోహన్ రావు విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా దళ్జిత్ సింగ్, సెక్రెటరీగా దేవరాజు, జాయింట్ సెక్రెటరీగా బసవరాజు, ట్రెజరర్ గా సిజే శ్రీనివాస్ రావు, కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్‌గా గెలిచారు.

New Update
HCA Elections: HCA ఎన్నికల ఫలితాలు.. కొత్త ప్రెసిడెంట్‌ ఎవరంటే?

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. కొత్త ప్రెసిడెంట్‌గా జగన్ మోహన్ రావు విజయం సాధించారు.

ఇంకా ఎవరు ఎవరూ గెలిచారంటే?

➼ వైస్ ప్రెసిడెంట్ గా దళ్జిత్ సింగ్..(గుడ్ గవర్నెన్స్ ప్యానేల్)

➼ సెక్రెటరీగా దేవరాజు..(క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)

➼ జాయింట్ సెక్రెటరీగా బసవరాజు..(గుడ్ గవర్నెన్స్ ప్యానెల్)

➼ ట్రెజరర్ గా సిజే శ్రీనివాస్ రావు..(యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ hca ప్యానెల్)

కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్..(క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)జగన్ మోహన్‌కు 63 ఓట్లు రాగా, అమర్‌నాథ్‌కు 62 ఓట్లు వచ్చాయి. గుడ్ గవర్నెన్స్ ప్యానెల్‌కు చెందిన దల్జీత్ సింగ్ 63 ఓట్లతో 17 ఓట్ల మెజారిటీతో ఉపాధ్యక్ష పదవికి పోటీలో గెలుపొందారు. అతని సమీప ప్రత్యర్థులు టి శ్రీనివాస్ (46), శ్రీధర్ (41)పై గెలిచారు. ప్యానెల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి బసవరాజు కేవలం ఒక ఓటుతో చిట్టి శ్రీధర్‌ను ఓడించి సంయుక్త కార్యదర్శి పదవిని గెలుచుకున్నారు. బసవరాజుకు 60 ఓట్లు రాగా, శ్రీధర్‌కు 59 ఓట్లు వచ్చాయి. వారికి నోయల్ డేవిడ్ (40), సతీష్ (8) మరో ఇద్దరు పోటీదారులు. HCA ప్యానెల్ యునైటెడ్ సభ్యులు CJ శ్రీనివాసరావు కోశాధికారిగా ఉంటారు అతను తన సమీప ప్రత్యర్థి (సంజీవ్ 33)ని 33 ఓట్ల మెజారిటీతో ఓడించి 66 ఓట్లతో విజయం సాధించారు. కౌన్సిలర్ పదవి కోసం జరిగిన పోరులో క్రికెట్ ఫస్ట్ ప్యానెల్‌కు చెందిన సునీల్ కుమార్ అగర్వాల్ స్వల్ప తేడాతో విజయం సాధించారు. అన్సార్ అహ్మద్ (50), వినోద్ ఇంగ్లే (47) కంటే 59 ఓట్లు ఆధిక్యంలో నిలిచారు.

Also Read:  విద్యా వ్యవస్థ స్కాంలే టార్గెట్.. అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసేది ఇదే..!!
ఇక హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పేరును ఆ అసోసియేషన్ ఓటరు జాబితా నుంచి గతంలో తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అజార్‌పై అనర్హత వేటు పడింది. ఆయన హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే, డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు ఈ అనర్హత వేశారు. ప్రస్తుతం జస్టిస్ లావు నాగేశ్వరరావు చేతిలోనే హెచ్‌సీఏ బాధ్యతలు ఉన్నాయి. తాజాగా జగన్ మోహన్‌ గెలవడంతో కొత్త ప్రెసడిండ్‌గా ఆయన ఎన్నికయ్యారు.

Also read: కోహ్లీ సెంచరీకి అంపైర్ హెల్ప్ చేశాడా? విరాట్‌ సెల్‌ఫిష్‌ బ్యాటింగ్‌ చేశాడా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణకు ఓకే.. రూ.1403 కోట్లతో కొత్త అసెంబ్లీ, హైకోర్టు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

New Update
AP Cabinet Meeting

AP Cabinet Meeting

AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇన్‌ సిటీస్‌ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

విశాఖలోని ఐటీహిల్‌ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించింది. బలిమెల, జోలాపుట్‌ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్‌ కన్సార్టియమ్‌కు కూడా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్‌, సౌర విద్యుత్‌ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

 

Advertisment
Advertisment
Advertisment