BRS OFFICE: కేసీఆర్‌కు బిగ్ షాక్‌.. బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు నోటీసులు!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ మున్సిపాల్టీ యాక్ట్‌ 2019 సెక్షన్‌ 254 కింద హన్మకొండ బీఆర్ఎస్ ఆఫీసులు నోటీసులు పంపించారు అధికారులు. భవన నిర్మాణ అనుమతి, భూమి కేటాయింపు కాపీలను 3 రోజుల్లో సమర్పించాలని ఆర్డీవోను ఆదేశించారు కలెక్టర్.

New Update
BRS OFFICE: కేసీఆర్‌కు బిగ్ షాక్‌.. బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు నోటీసులు!

Notice To BRS Office: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు (KCR) వరుస షాకులు తగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీసులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ మున్సిపాల్టీ యాక్ట్‌ 2019 సెక్షన్‌ 254 కింద హన్మకొండ (Hanamkonda) బీఆర్ఎస్ ఆఫీసులు నోటీసులు పంపిచారు అధికారులు. బీఆర్ఎస్ ఆఫీస్‌ కేటాయింపు కాపీలు వెరిఫికేషన్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణ అనుమతి, భూమి కేటాయింపు కాపీలను 3 రోజుల్లో సమర్పించాలని ఆర్డీవోను ఆదేశించారు. బీఆర్ఎస్‌ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌కు సైతం ఈ ఇష్యూలో మున్సిపల్ అధికారులు నోటీసులు పంపించారు. ఈ భవనానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ సమర్పించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆఫీసును (Nalgonda BRS Office) కూల్చేయాలని కలెక్టర్, మున్సిపల్ అధికారులకు కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆదేశాలు జారీ చేశారు. ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారని, వెంటనే దీనిపై యాక్షన్ మొదలుపెట్టాలంటూ నల్గొండ కలెక్టర్ కు సూచించారు. గవర్నమెంట్‌ ఆసుపత్రిలో కోట్లు విలువచేసే ప్రభుత్వభూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్‌ పర్మిషన్‌ లేకుండా కట్టారు. అసలు రూల్స్‌ ప్రకారం మున్సిపల్‌ కమిషనర్‌ ఎప్పుడో కూలగొట్టాలే.నేను చెప్పలే, చెప్తే ఎప్పుడో కూలగొడుతుండే. ఆఫీసుకు పర్మిషన్‌ ఉన్నదా?పేదలు ఇండ్లు కట్టుకుంటే అధికారులు ఊరుకోరని, బీఆర్ఎస్ ఆఫీసు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. దాదాపు వంద కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి పార్టీ ఆఫీసు నిర్మించారని అన్నారు. ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చినట్టు మున్సిపల్ కమిషనర్ తెలుపగా.. దానిని వెంటనే కూల్చివేయాలని అన్నారు. మంత్రిగా తాను ఆదేశాలు జారీ చేస్తున్నానని చెప్పారు.పర్మిషన్‌ తీసుకొని కట్టుకుంటే ఏమనేవాళ్లం కాదు. నిబంధనల ప్రకారం కలెక్టర్‌ వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉమెన్స్‌ హస్టల్‌, మరేదైన ప్రభుత్వ కార్యాలయం నిర్మించే అవకాశం ఉంటుందని తెలిపారు వెంటనే దాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. 

Also Read: రాబోయే 15 ఏళ్లు బీఆర్ఎస్‌దే అధికారం.. ఎన్టీఆర్‌కు ఇలాగే జరిగింది: కేసీఆర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hafiz Saeed : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే భారత్ రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
modi, Hafiz Saeed

modi, Hafiz Saeed

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత మోదీ సర్కార్ కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మీరు పాకిస్థాన్ కు నీళ్లు ఆపుతారా? కశ్మీర్లో డ్యామ్ కట్టి నీళ్లు ఆపితే మేము మీ శ్వాస ఆపుతాం. ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుంది' అని హఫీజ్ గతంలో మాట్లాడిన వీడియోను పాక్ ISI వైరల్ చేస్తూ పాకిస్థానీలను రెచ్చగొడుతోంది. 

Also Read :  జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ప్రతీ నీటి బొట్టుపై హక్కు ఉంది

మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించింది.  సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడమంటే యుద్ధం ప్రకటించడమేనన్నారు. ప్రపంచ బ్యా్ంకు వంటి సంస్థలు కుదుర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనం, చట్టవిరుద్ధమైన చర్య అని పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు.   

Also Read :  భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత లేఖ

సింధు జలాల ఒప్పందం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది. సింధూ నది టిబెట్‎లో పుట్టి.. భారత్, పాక్ మీదుగా 3 వేల 180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా ఆరు ఉపనదులు కూడా కలుస్తుంటాయి. దేశ విభజన అనంతరం సింధు జలాల నిర్వహణపై భారత్, పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో చాలా విషయాల్లో వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై ఇరువురు  సంతకాలు చేశారు. 

Also Read :  పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!

Also Read :  విడదల రజనికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట!

telugu-news | Jammu and Kashmir | india | Lashkar Chief Hafiz Saeed

Advertisment
Advertisment
Advertisment