/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ind-vs-eng-jpg.webp)
INDIA VS ENGLAND 2nd test: ఇంగ్లండ్పై జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్లో 231 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 202 రన్స్కు ఆలౌట్ అయ్యింది. హైదరాబాద్ గడ్డపై టీమిండియా టెస్టు మ్యాచ్ ఓడిపోవడం ఇదే తొలిసారి. రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు, బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇక రెండో టెస్టు విశాఖలో జరగనుంది. ఫిబ్రవరి 2న ప్రారంభంకానున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది.
What have you done Jadeja bro. Run out in test cricket is no less than a crime. #INDvsENG pic.twitter.com/98lBYwwVMm
— R A T N I S H (@LoyalSachinFan) January 28, 2024
జడేజా ఆడడం డౌటే:
హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో జడేజా గాయపడ్డాడు. హామ్ స్ట్రింగ్ గాయంతో జడేజా బాధపడుతున్నాడు. ఫిబ్రవరి 2న ప్రారంభమయ్యే విశాఖ టెస్ట్కు జడేజా దూరమయ్యే అవకాశం ఉంది. గాయపడిన ఆటగాళ్ల స్కాన్ నివేదికలను ముంబై ఇన్స్టిట్యూట్కు పంపిస్తారు. ఇవాళ(జనవరి 29)లోపు ప్రొఫెషనల్ మెడికల్ ఒపీనియన్ని అందించాల్సి ఉంటుంది. తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో జో రూట్ వేసిన బంతిని ఫేస్ చేసిన జడేజా పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే బెన్ స్టోక్స్ నుంచి నాన్-స్ట్రైకర్ ఎండ్లో నేరుగా త్రో పడింది. దీంతో జడేజా ఔటయ్యాడు.
మిడిలార్డర్ పోరాడినా:
ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను భారత్ పరాభవంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్ విజయంతో ఇంగ్లీష్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. 7వికెట్లతో చెలరేగిన టాం హార్ట్లీ భారత జట్టు వెన్నువిరిచాడు. టాపార్డర్ విఫలమైనా టీమిండియా మిడిలార్డర్ ఇంగ్లండ్ స్పిన్నర్లను కొంతసేపు నిలువరించి పరుగులు రాబట్టగలిగింది. ఎనిమిదో వికెట్కు అశ్విన్-భరత్ 50 పరుగుల భాగస్వామ్యం పూర్తిచేయడంతో భారతజట్టు పరాజయం అంతరాన్ని తగ్గించుకోగలిగింది. 176 పరుగుల వద్ద భరత్, 182 పరుగుల వద్ద అశ్విన్ ఔటవడంతో టీమిండియా ఓటమి దఖాయమైంది. ఇక 202 పరుగుల వద్ద ఇంగ్లాండ్ విజయ లాంఛనం పూర్తయ్యింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో హార్ట్లీ 7, జో రూట్ 1, జాక్ లీచ్ 1 వికెట్లు పడగొట్టారు.