Madanapalli: మదనపల్లిలో అర్థరాత్రి కాల్పుల కలకలం! మదనపల్లి మండలంలో ఆదివారం అర్థరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. దివాకర్, అతని స్నేహితులతో గొడవ పడుతున్న క్రమంలో ఆనంద్ అనే వ్యక్తి వద్దని వారించడంతో దివాకర్ కి అతనికి గొడవ మొదలైంది. వారిని విడదీసేందుకు ప్రయత్నించి ప్రవీణ్ మీద దివాకర్ కాల్పులు జరిపాడు. By Bhavana 29 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Madanapalli: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో ఆదివారం అర్థరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మండలంలోని వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో దివాకర్, అతని స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగి గొడవ పడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆనంద్, అనే వ్యక్తి ఎందుకు గొడవ పడుతున్నారని దివాకర్ని ప్రశ్నించాడు. దీంతో వారిద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలను వారించేందుకు రెడ్డి ప్రవీణ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి మాట్లాడుతుండగా.. దివాకర్ ఇంటికి వెళ్లి నాటు తుపాకీని తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నాటు తుపాకీ కాల్పుల్లో రెడ్డిప్రవీణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మదనపల్లి తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. Also read: వరదలకు కారణం వాళ్లే..ఆ 12 మంది అధికారులకు 27 ఏళ్ల జైలు! #gun #ap #madanapalli #crime #shot సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి