AP : ఏపీలో దారుణం.. కన్న తండ్రిని రాయితో కొట్టి చంపిన కూతురు! ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురైయ్యాడు. పట్టణంలోని పీ అండ్ టీ కాలనీలో కన్నకూతురే తండ్రిని కడతేర్చింది.ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొరస్వామి ని కుమార్తె హరిత హత్య చేసినట్లు సమాచారం. By Bhavana 13 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Government Teacher Killed By Daughter : ఏపీ (Andhra Pradesh) లోని అన్నమయ్య జిల్లా (Annamayya District) లోని మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య (Murder) కు గురైయ్యాడు. పట్టణంలోని పీ అండ్ టీ కాలనీలో కన్నకూతురే తండ్రిని కడతేర్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొరస్వామి ని కుమార్తె హరిత హత్య చేసినట్లు సమాచారం. దొరస్వామి తలపై పదునైనా ఆయుధంతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఆయన మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్, తాలూకా సీఐలు వల్లిబషు, శేఖర్ కేసు గురించి విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దొరస్వామి దిగువ కురవవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం భార్య మృతిచెందడంతో కుమార్తె హరితతో కలిసి ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున తలపై బలంగా కొట్టడంతో ఆయన మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుమార్తె హరితను పోలీసులు విచారిస్తున్నారు. Also read: పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కిన లోకేష్.. వీడియో వైరల్ #andhra-pradesh #madanapalle #murder #annamayya-dist సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి