Aiadmk: తమిళనాడులో కీలక పరిణామం.. ఎన్డీఏతో పొత్తుకు అన్నాడీఎంకే గుడ్ బై

సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలు ముందు తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తును తెగతెంపులు చేసుకున్నట్లు అన్నాడీఎంకే సంచలన నిర్ణయం ప్రకటించింది. చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

New Update
Aiadmk: తమిళనాడులో కీలక పరిణామం.. ఎన్డీఏతో పొత్తుకు అన్నాడీఎంకే గుడ్ బై

Aiadmk: సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలు ముందు తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తును తెగతెంపులు చేసుకున్నట్లు అన్నాడీఎంకే సంచలన నిర్ణయం ప్రకటించింది. చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మునుస్వామి మాట్లాడుతూ ఎన్డీయే కూటమితో బంధాన్ని తెంచుకున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే మాజీ నేతలతో పాటు తమ ప్రధాన కార్యదర్శి పళనిస్వామిపై ఏడాదిగా బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీతో సంబంధాలు తెంచుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన అనంతరం ఆ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఎన్డీఏలో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ఉన్నా తమిళనాడులో మాత్రం ఇరు పార్టీల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకేసి దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, అన్నాదురై పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పార్టీ సీనియర్లంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు. అయినా కానీ బీజేపీ పెద్దలు అన్నామలైపై చర్యలు తీసుకోకపోవడం అన్నాడీఎంకే నేతలకు మింగుడుపడలేదు. అలాగే బీజేపీతో కూటమి వల్లే గత ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయిందనే అభిప్రాయం కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో బలంగా ఉంది. దీంతో ఇప్పుడు కమలం పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు.

ఉత్తరాది రాష్ట్రాలో ఎంతో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అత్యంత బలహీనంగా ఉంది. మొన్నటి వరకు ఒక్క కర్ణాటకలో మాత్రమే అధికారంలో ఉంది. ఇప్పుడు అక్కడ కూడా అధికారం కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. ఇప్పుడు తమిళనాడులో పెద్ద పార్టీగా ఉన్న అన్నాడీఎంకే కూడా పొత్తుకు బైబై చెప్పడంతో కమలం పార్టీకి మరింత గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక త్వరలో రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మాత్రం ఇక ఆ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

హైదరాబాద్ వాసులకు నోరూరించే ఆఫర్. ఫ్రీ మండి బిర్యానీ. అది కూడా ఎలాంటి షరతులూ లేకుండా.హైటెక్ సిటీలో బిగ్ ప్లేట్ మండి రెస్టారెంట్ పెట్టి మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భోజన ప్రియులను ఆకర్షించేందుకు ఫ్రీ మండి బిర్యానీ ఆఫర్‌ ని పెట్టినట్లు తెలుస్తోంది.

New Update
mandi (1)

హైదరాబాద్‌ అంటేనే భోజన ప్రియులకు అడ్డా అని చెప్పొచ్చు. నోరూరించే వంటకాలతో ఎన్నో రెస్టారెంట్లు, హోటళ్లు భోజన ప్రియులకు నిత్యం స్వాగతం పలుకుతూనే ఉంటాయి. ఎన్ని వెరైటీ వంటకాలున్నా.. హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. బిర్యానీకి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో మండి బిర్యానీకి కూడా అదే రేంజ్‌లో ఫ్యాన్స్‌ ఉంటారనే విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడిప్పుడే మండి బిర్యానీకి క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో.. యువతను ఆకర్షించేందుకు చాలా రెస్టారెంట్లు రకరకాల ఆఫర్లు పెడుతున్నాయి.

Also Read: Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

"మీ పుట్టిన రోజా.. అయితే ఫ్రీగా బిర్యానీ లాగించేయొచ్చు.. జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే చాలు.. తిన్నంత బిర్యానీ.." అంటూ ఇప్పటికే పలు రెస్టారెంట్లు ఆఫర్లు ప్రకటించేశారు. కాగా.. ఇప్పుడు ఓ మండి రెస్టారెంట్ ఇలాంటి అద్భుతమైన ఆఫర్‌నే ప్రకటించింది. అయితే.. ఇక్కడ ఆధార్ కార్డు కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఎంచక్కా రావొచ్చు మండి బిర్యానీ లాగించేయొచ్చు. మరి ఈ అద్దిరిపోయే ఆఫర్ ఎక్కడ.. ఎప్పుడు.. తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.

Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

హైటెక్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్ బిగ్ ప్లేట్ మండి  తమ కస్టమర్లకు ఈ అద్దిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సోమవారం రోజున తమ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లందరికీ ఉచిత మండి విందు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విందు భోజనం ఆఫర్‌ మధ్యాహ్నం 12:00 గంటల నుంచి మొదలవుతుంది. అయితే.. ఈ ఆఫర్ కోసం ఎలాంటి ఆధార్ కార్డులు, ఐడీ కార్డులు చూపించాల్సిన అవసరం లేదని రెస్టారెంట్ యాజమాన్యం ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చింది.

కొన్ని చిన్న చిన్న కండీషన్లు మాత్రం ఉన్నట్టుగా యాజమాన్యం వివరించింది. ఒక్కో వ్యక్తికి ఒక్కసారి మాత్రమే మండి వడ్డించనున్నారు. అయితే.. ఇది అన్ లిమిటెడ్ మాత్రం కాదండోయ్. ఒక్కరికి ఒక్క లెగ్ పీస్‌తో పాటు సింగిల్ మండి రైస్ ఇవ్వనున్నారు. ఇద్దరు వెళ్తే రెండు లెగ్‌ పీసులు ఇద్దరికి సరిపోయే మండి రైస్, ముగ్గురు వెళ్తే మూడు లెగ్ పీసులు ముగ్గురికి సరిపోయే మండి రైస్.. ఇలా ఎంత మంది వెళ్తే అంత మందికి సరిపోయేంత మాత్రమే ఇవ్వనున్నట్టు యాజమాన్యం చెప్పింది.

మరి మండే రోజు మండి బిర్యానీ ఫ్రీగా ఇవ్వటమేంటీ అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే... బిగ్ ప్లేట్ మండి రెస్టారెంట్ పెట్టి ఆరోజుకి మూడేళ్లు అవుతుందంటా. మూడో వార్షికోత్సవం సందర్భంగా.. తమ కస్టమర్లతో పాటు మిగతా భోజన ప్రియులను ఆకర్షించేందుకు ఈ ఆఫర్ పెట్టినట్టు సమాచారం. . ఈ బిగ్ ప్లేట్ మండి.. హైటెక్ సిటీలో శిల్పారామానికి ఎదురుగా ఉంటుందని సమాచారం.

Also Read: Hanuman Jayanti-2025: హనుమాన్ జయంతి నాడు ఇలా చేయండి.. మీ శని, దరిద్రం పరార్!

Also Read: South Africa: పెంగ్విన్ కారణంగా కూలిపోయిన హెలికాఫ్టర్

mandi | biryani | telangana | hyderabad | mandi biryani | free | offer | latest-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment