Liquor: తెలంగాణలో నేటితో ముగియనున్న మద్యం టెండర్లు.. భారీగా పెరుగుతున్న పోటీ

తెలంగాణలో నేటితో మద్యం టెండర్లు ముగుస్తున్నాయి. చివరి రోజు కావటంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. దీనికోసం ఎక్సైజ్ కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒక్కో దుకాణానికి 50 నుంచి 200 దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

New Update
Telangana News: తెలంగాణలో మందుబాబులకు షాక్.. 3 రోజులు వైన్స్ బంద్.. ఎందుకంటే?

Liquor Shops Tenders Last Date in Telangana: నిజామాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు మంచి స్పందన వచ్చింది. టెండర్లు వేసేందుకు వ్యాపారులు భారీగా పోటీ పడ్డారు. నిన్న ఉమ్మడి జిల్లాలో 1405 టెండర్లు దాఖలయ్యాయి. ఇవ్వాళ్టితో టెండర్ల దాఖల గడువు ముగుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 3094 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇక చివరి రోజు కావటంతో టెండర్లకు భారీగా దాఖలు అయ్యే అకాశాలు ఉన్నట్లు తెలిపారు.

అయితే.. ఈ టెండర్లు వేసేందుకు వ్యాపారులు భారీగా పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతుందన్నారు. నిజామాబాద్ పరిధిలో 404, బోధన్ 134, ఆర్మూర్ 172, భీమ్‌గల్ 113, మోర్తాడ్‌ పరిధిలో మొత్తం 960 దరఖాస్తులు వచ్చాయిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11 రోజులుగా ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్లు 1706 వరకు చేరిందని అధికారులు తెలిపారు. ఈ పోటీలో నిన్నటి వరకు 50 శాతం టెండర్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజు కావడంతో అంచనాల కన్నా ఎక్కువ అప్లికేషన్లు వస్తాయని అధికారులు తెలిపారు.

ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 49 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. దీంతో జిల్లాలోని వ్యాపారుల నుంచి స్పందన భారీగా వచ్చింది. జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు 1388 దరఖాస్తులు రాగ.. గురువారం ఒక్కరోజు 445 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజుతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్టేషన్ల వారీగా పరిశీలిస్తే.. కామారెడ్డి స్టేషన్‌ పరిధిలో 469, రోమకొండ పరిధిలో 273, ఎల్లారెడ్డి 204, బాన్సువాడ 220, బిచ్చుంద 222 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

Also Read: కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment