Good News: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

సిద్దిపేట ప్రజలకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి సిద్దిపేట జిల్లాలో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 3న సికింద్రాబాద్‌-సిద్దిపేట మధ్య రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయని రైల్వే శాఖ తెలిపింది.

New Update
Good News: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

సిద్దిపేట ప్రజలకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి సిద్దిపేట జిల్లాలో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 3న సికింద్రాబాద్‌-సిద్దిపేట మధ్య రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ నగరాల మధ్య తిరిగే ట్రైన్ సిద్దిపేట నుంచి ప్రారంభం కానుందని స్పష్టం చేసింది. మొదట అక్టోబర్ 3న రెండు ప్యాసింజర్‌ ట్రైన్స్‌ నడుతామని తెలిపిన దక్షిణ మధ్య రైల్వే.. అనంతరం రద్దీని బట్టి ట్రైన్ సర్వీసులను పెంచేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

కాగా మొదట కాచిగూడ నుంచి సిద్దిపేటకు రైలు సర్వీసులను నడపాలపి భావించిన రైల్వే శాఖ.. కానీ సిద్దిపేట నుంచి వచ్చే ప్రయాణికులు ఎక్కవ శాతం సికింద్రాబాద్‌కు వస్తారని, అందుకే ట్రైన్‌ను సిద్దిపేట-సికింద్రాబాద్‌ల మధ్య నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్యాసింజర్‌ రైలు నెంబర్ 07483గా తెలిపిన రైల్వే అధికారులు.. ఈ ట్రైన్‌ సిద్దిపేటలో ఉదయ 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 10 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందని స్పష్టం చేశారు.

మళ్లీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరీ అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు ప్రయాణికులను సిద్దిపేటకు తీసుకువెళ్లనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట నుంచి బయలు దేరనున్న ఈ రైలు.. సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులతో రానుంది. మరో 30 నిమిషాల గ్యాప్‌ అనంతరం సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరనున్న ఈ రైలు.. రాత్రి 8 గంటల 40 నిమిషాలకు సిద్దిపేట చేరుకోనుంది. సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య 116 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన ఈ రైలు మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్‌, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌, మనోహరాబాద్‌, నాచారం, బేగంపేట, గజ్వేల్‌, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట స్టేషన్స్‌లో ఆగనుంది. ఈ ట్రైన్‌కు సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేటకు టికెట్ ధర 60 రూపాయలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. ట్రైన్‌ సర్వీస్‌తో సిద్దిపేట నుంచి హైదరాబాద్‌ వచ్చే ప్రయాణికుల జర్నీ సులువు కానుంది.

ALSO READ: జగన్‌కు పోయే కాలం దగ్గరపడింది

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....

ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం ఆరా తీశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న  ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

 ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో  దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద  చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత  కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment