TG News: జలదిగ్బంధంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం.. మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం 53 అడుగుల వద్దకు నీరు చేరటంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 30 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. మరో 2 అడుగుల వరకు గోదావరి పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

New Update
TG News: జలదిగ్బంధంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం.. మూడో ప్రమాద హెచ్చరిక

Bhadrachalam: భారీ వర్షాల కారణంగా మహోగ్రరూపం దాల్చింది గోదావరి నది. భద్రాచలం వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం 53 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తునదున్న అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం అశోక్‌నగర్, కొత్తకాలనీ, AMC కాలనీలోకి వరద నీరు చేరింది. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీటిని మోటార్ల సహాయంతో నీటిని గోదావరిలోకి అధికారులు పంపిస్తున్నారు. 30 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. జలదిగ్బంధంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం ఉండగా.. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరో 2 అడుగుల వరకు గోదావరి పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎగువ రాష్ట్రం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో భారీ వర్షం కారణంగా తాళిపేరుకు వరద నీరు పోటెత్తుతున్నది. ప్రస్తుతం తాళిపేరు వద్ద 25 గేట్లను అధికారులు ఎత్తిన్నారు. లక్షా 7 వేల 714 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తాళిపేరు ఇన్‌ఫ్లో లక్షా 297 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో లక్షా 7 వేల 714 క్యూసెక్కులు నీరు ఉంది. ఇప్పటికే భద్రాచలం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారిపైకి వరద చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయ్యాయి. వర్షాలతో భక్తులు లేక నిర్మానుష్కంగా రామాలయం ఉండగా.. గోదారమ్మ శాంతించు తల్లి అంటూ ఆలయ అధికారులు పూజలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో వేడి నీటితో స్నానం చేయడం బిడ్డకు ప్రమాదకరమా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి మరో ఆల్‌రౌండర్ ఔట్!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

🔴Live News Updates:

Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మంది ఉద్యోగులపై వేటు విధించినట్లు తెలుస్తోంది.

Google
Google Photograph: (Google )

 

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతోంది. అనేక కంపెనీలు తమపై ఆర్థిక భారాన్ని దించుకోవడానికి ఒకేసారి వందలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ.. వందలాది మందిపై వేటు వేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మందిని గురువారం ఒకేసారి ఉద్యోగాల్లోంచి తొలగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు కరెక్టుగా ఎంత మందిపై లేఆఫ్స్ ప్రభావం పడిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే గూగుల్ ఇంత పెద్ద మొత్తం లేఆఫ్స్ ఎందుకు విధించిందో అనే విషయాలు గురించి తెలుసుకుందాం.

Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

ఏప్రిల్ 10న గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ ఒకేసారి వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త తాజాగా వెలుగులోకి రాగా.. కరెక్టుగా ఎంత మంది ఉద్యోగాలు పోయాయనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై మాత్రం ఈ లే ఆఫ్‌ల ప్రభావం పడినట్లు తెలుస్తుంది. జనవరి లో గూగుల్ తన ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించి.. వెంటనే రెండు నెలలకే కోతలు విధించడంతో అంతా షాక్ అవుతున్నారు.

Also Read: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు

ముఖ్యంగా 2024 డిసెంబర్ నెలలో కూడా గూగుల్ సంస్థ 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు  2023 జనవరి నెలలో మొత్తంగా 12 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. అయితే ఇందుకు కారణాలు చాలానే ఉన్నట్లు అనేక వార్తలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత్వం వల్ల గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికా ప్రతీకార సుంకాల యుద్ధం, మాంద్యం భయాలు, లాభాలు పూర్తిగా క్షీణించిపోవడం, ఏఐ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల.. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు విధిస్తున్నట్లు తెలుస్తుంది.

ఒక్క గూగుల్ సంస్థనే కాకుండా అనేక కంపెనీలు పలు కారణాలు చెబుతూ.. వేలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నాయి. 2025వ సంవత్సరంలోనే సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27 వేల 762 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వై వెబ్‌సైట్ వెల్లడించింది. 2024లో సుమారు 549 కంపెనీలు లక్షా 52 వేల 472 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అలాగే అంతకు ముందు  2023లో వెయ్యి 193 కంపెనీలు.. 2 లక్షల 64 వేల 220 మంది ఉద్యోగాలకు కోత విధించినట్లు స్పష్టం చేసింది.

Also Read: Tahawwur Rana: తహవ్వుర్‌ రాణాపై కీలక అప్‌డేట్‌.. ఎక్కడ ఉంచారంటే..?

Also Read: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మితిమీరుతున్న ఆంక్షలు..మోడ్రన్ హెయిర్ కట్ చేసినా..

  • Apr 12, 2025 14:50 IST

    గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!

    ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను గాయలబెడద వేధిస్తోంది. ఇప్పటికే కీలక పేసర్ కగిసో రబాడ జట్టుకు దూరమవగా తాజాగా మరో ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా ఈ టోర్నీ ఆడట్లేదని జీటీ టీమ్ అధికారిక పోస్ట్ పెట్టింది.

    gt ipl
    gt ipl Photograph: (gt ipl)

     



  • Apr 12, 2025 08:50 IST

    మరో ప్రాణం తీసిన పరువు హత్య.. వేరే కులస్థుడిని ప్రేమిస్తుందని తల్లి ఏం చేసిందంటే?

    గిరిజన యువకుడిని ప్రేమిస్తుందని తల్లి కూతురిని చంపిన దారుణ ఘటన తిరుపతిలో జరిగింది. మైనర్ బాలిక ఓ యువకుడితో గర్భం దాల్చగా.. తల్లి పోక్సో చట్టం కింద కేసు పెట్టి జైలుకి పంపించింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ మళ్లీ కలవడంతో తల్లి కూతురిని చంపేసింది.

    suryapet crime
     crime

     

     



  • Apr 12, 2025 08:48 IST

    Ram Charan Campa AD: రామ్ చరణ్- 'కాంపా’ బ్రాండ్ సరికొత్త కోలా యాడ్ చూశారా..?

    రామ్ చరణ్ 'కాంపా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. మిలీనియల్స్, జెన్ Zను లక్ష్యంగా చేసుకొని ఐపీఎల్ సమయంలో ‘కాంపా వాలి జిద్’ ప్రచార చిత్రం విడుదల కానుంది. ఇది కాంపా బ్రాండ్ విస్తరణలో కీలక అడుగు కావడం విశేషం.

    Ram Charan Campa AD
    Ram Charan Campa AD

     



  • Apr 12, 2025 06:39 IST

    Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నాయి.

    AP Govt
    AP Govt

     



Advertisment
Advertisment
Advertisment