Amith Shah: అమిత్ షాకి 50 రూపాయల నోటు పై ప్రేమ సందేశం! కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి ఓ యువతి '' డియర్ అమిత్ జీ, మే 29న నా పెళ్లి. కానీ మీరు నన్ను మీతో తీసుకుని వెళ్లండి'' అని రాసి ఉంది. అంతేకాకుండా పక్కన ఐ లవ్..అని కూడా రాసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయ్యింది By Bhavana 07 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Amith Shah: చాలా మంది ప్రేమికులు ప్రేమికుల దినోత్సవం కోసం ఎదురు చూస్తూ తమ ప్రేయసి/ప్రేమికుడ్ని ఎలా మెప్పించలా అని ఆలోచిస్తున్న సమయం ఇది. ఈ టైమ్ లో సోషల్ మీడియాలో(Social Media) ఓ ప్రేమలేఖ వైరల్ గా మారింది. ప్రేమలేఖ అంటే రంగురంగుల కాగితాల మీద ప్రేమికులు తమ భావాలను వ్యక్త పరుస్తూ ఎదుటి వారి ప్రేమను పొందేందుకు రాస్తుంటారు. కానీ ఇక్కడ వైరల్ అవుతున్న ప్రేమలేఖ మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఆ ప్రేమలేఖ రూ. 50 నోటు పై రాసి ఉంది కనుక. అది కూడా ఓ ప్రేమికురాలు తన ప్రియునికి రాసింది అనుకుంటే పొరపాటే...ఓ యువతి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు (Amith Shah) రాసింది. దాంతో ఆ నోటు లేఖ తెగ వైరల్ (Viral) గా మారింది. ఆ 50 రూపాయల నోటు (Rs. 50 note) పై ఓ యువతి '' డియర్ అమిత్ జీ, మే 29న నా పెళ్లి. కానీ మీరు నన్ను మీతో తీసుకుని వెళ్లండి'' అని రాసి ఉంది. అంతేకాకుండా పక్కన ఐ లవ్..అని కూడా రాసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయ్యింది. ఈ పోస్టు పెట్టిన కొద్ది నిమిషాల్లోనే 13 వేల మందికి పైగా దీనిని లైక్ చేశారు. ఈ వైరల్ పోస్ట్ ఫన్నీ-హిందీ- పోస్ట్ 0 అనే ఇన్ స్టా పేజీలో ఉంది. దీనిని చూసిన తరువాత నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అమిత్కి ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని, మీరు లేఖ రాయడం కంటే కాల్ చేసి ఉండాల్సింది సోదరి అని ఒకరు ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. Also read: ముస్లింల పూర్వీకులు కూడా సనాతన ధర్మం పాటించిన వారే: యూపీ సీఎం యోగి! #50-rupees-note #amith-shah #viral సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి