YS Sharmila: షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు వివరించారు. పార్టీ సిద్దాంతాలు, భావాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానం పలుకుతామని తెలిపారు.

New Update
YS Sharmila: షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌  (Congress) పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్ద రాజు (Gidugu raddaraju)  పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సాఆర్‌ కుమార్తె వైఎస్‌ షర్మిల  (YS Sharmila) పార్టీలోకి వస్తే ఆమెను తప్పకుండా ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. ఈరోజు కాకినాడలో ఆయన వంద సంవత్సరాల క్రితం బుచ్చి సాంబ మూర్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ సెషన్స్‌ జరిగాయి. దాన్ని పురస్కరించుకొని శుక్రవారం కాకినాడలో సెంటినరీ సెలబ్రేషన్స్‌ (Cetinary Celebrations)  నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గిడుగు రుద్దరాజు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలోకి ఎవరు వచ్చిన ఆహ్వానిస్తామని తెలిపారు. గురువారం నాడు ఎయిర్‌ పోర్టులో డీకే శివకుమార్‌, చంద్రబాబు మామూలుగా మాట్లాడుకున్నారే తప్ప రాజకీయాల గురించి కాదని ఆయన వివరించారు.

వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల్ని సమయత్తం చేస్తుందని వివరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు రుద్దరాజు తెలిపారు. రానున్న ఎన్నికల కోసం ఏపీలో అభ్యర్థుల్ని ప్రకటించడానికి అధిష్టానం కూడా ముందుందని తెలిపారు.

కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఆయన వెంటనే ప్రత్యేక హోదా కల్పిస్తారని ఈ సందర్భంగా రుద్దరాజు వివరించారు. అలాగే స్టీల్ ప్లాంట్‌ వ్యతిరేకికరణ పై కూడా ఇప్పటికే కాంగ్రెస్‌ ఓ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

త్వరలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ,డీకే శివకుమార్,రేవంత్ రెడ్డి అగ్ర నాయకులందరూ ఏపీలో పర్యటిస్తారని గిడుగు రుద్రరాజు ప్రకటించారు.

Also read: నటి అమలాపాల్‌ మాజీ భర్త పై దాడి..కారు ఆపి మరీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: ఎంత ధైర్యం.. ప్రభాస్‌ను ఏంటి భయ్యా అఘోరీ ఇలా అనేసింది- దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!

నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందో? కలిస్తే ఒక్క సెల్ఫీ అడుగుతాను అని వర్షిణి తెలిపింది. వెంటనే అఘోరీ ఏంటీ ప్రభాస్ గోల ఆపు అనేసింది. అది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో అఘోరీని ట్రోల్ చేస్తున్నారు.

New Update

అందరూ ఊహించినట్లుగానే లేడీ అఘోరీ-శ్రీవర్షిణీ మ్యారేజ్ చేసుకున్నారు. అదీ ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌లో బ్రహ్మముహుర్తాన తెల్లవారిజామున 4 గంటలకు వర్షిణీ మెడలో అఘోరీ తాళి కట్టింది. రెండోసారి వర్షిణీ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారం చైన్‌ను మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది. ఇది గడిచి చాలా రోజులే అయింది. కానీ ఇప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

ప్రభాస్ అంటే ఇష్టం

వర్షిణీ మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. అక్కడ నుంచి RTVతో లైవ్ లో మాట్లాడిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తమ ఇష్యూలోకి ప్రభాస్‌ను లాగారు. ప్రభాస్ లాంటి అబ్బాయిని పెళ్లిచేసుకోవాలనిపించలేదా? అనే ప్రశ్నకు వర్షిణీ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ లాంటి అబ్బాయి ఉండడని అనుకున్నాను. కేవలం హీరోస్‌లోనే ఇష్టం.. రియల్ లైఫ్‌లో కాదు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

ప్రభాస్‌ను డైరెక్ట్‌గా ఎప్పుడూ చూడలేదు. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నాను. ప్రభాస్‌ను ఫస్ట్ టైం షూటింగ్ లో కానీ ఎక్కడైనా కలిస్తే ఆయన దగ్గరకి వెళ్లి.. హాయ్ సర్ ఐయామ్ బిగ్ ఫ్యాన్‌ ఆఫ్ యు డార్లింగ్ అని చెప్తాను. అంతేకాకుండా ఒక సెల్ఫీ కూడా అడుగుతాను. అఘోరీని కూడా డార్లింగ్ అని పిలిస్తాను’’ అని అఘోరీని డార్లింగ్ అని పిలిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

అయితే వర్షిణీ ప్రభాస్ గురించి మాట్లాడుతుండగా.. సరిగ్గా అప్పుడే అఘోరీ వచ్చి ఏంటీ ప్రభాస్ గోల అని లైవ్‌లో అనేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తిపోయింది. ఒక్కసారిగా వారు షాక్ అయిపోయారు. తమ అభిమాన హీరో గురించి అఘోరీ అలా అనడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

(aghori | sri varshini | aghori sri varshini | Aghori Sri Varshini Lov | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment