మళ్లీ గీత గోవిందం కాంబో.? క్రేజీ అప్డేట్‌ని రివిల్ చేసిన రౌడీ

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచిన మూవీ గీత గోవిందం. ఈ మూవీతో డైరెక్టర్ పరశురాం, విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా క్రేజీ కాంబినేషన్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ ముగ్గురూ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో సందడి చేయనున్నట్లు తాజాగా హీరో విజయ్‌ దేవరకొండ క్రేజీ అప్డేట్ పోస్ట్ చేశారు.

New Update
మళ్లీ గీత గోవిందం కాంబో.? క్రేజీ అప్డేట్‌ని రివిల్ చేసిన రౌడీ

గీత గోవిందం పరిమిత అంచనాల మధ్య విడుదలై టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. పరశురాం దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ ముగ్గురూ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అలాంటి టైం వచ్చేసింది. పరశురాం, రష్మిక మందన్నాతో కలిసి ఒక్క చోట చేరి సందడి చేసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు విజయ్‌ దేవరకొండ.

నేటికి ఐదేళ్లను పూర్తి చేసుకున్న మూవీ

అయితే వీరంతా మళ్లీ కలవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటో తెలుసా..? గీతగోవిందం విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఆనాటి మధురక్షణాలను గుర్తు చేసుకుంటూ ఛిల్ అవుట్‌ అయ్యారు. ఈరోజు చాలా జరుగుతోంది. మొదటగా అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. మరొకటి ఏంటంటే ఈ డార్లింగ్స్‌తో గీతగోవిందం ఐదేండ్లు పూర్తయింది. ఇంకోటి ఖుషి మ్యూజిక్ కన్సర్ట్‌ రెడీ అవుతోంది.. అని క్యాప్షన్‌ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పరశురాం, విజయ్‌ దేవరకొండ కాంబోలో VD 13 మూవీ

ఇదిలా ఉంటే మరోవైపు పరశురాం, విజయ్‌ దేవరకొండ కాంబోలో VD 13 తెరకెక్కుతోంది. హై బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్‌ ఫీమేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. VD 13 ఈ బ్యానర్‌లో వస్తున్న 54వ ప్రాజెక్ట్‌. ఈ మూవీతో మంచి ఫాంలో ఉన్న రౌడీ తన మూవీ హిట్‌పై ఫుల్ కాన్సంట్రేషన్ చేస్తున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు