Kadapa : కడపలో ప్రైవేట్ బస్సుల నిర్వాకం.. పెద్ద ఎత్తున గంజాయి తరలింపు!

AP: కడప మైదుకూరు రోడ్డులో ప్రైవేట్ బస్సు యజమానులు రెచ్చిపోతున్నారు. బస్సులో వస్తువుల ప్యాకేజిలలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారు. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు.

New Update
Kadapa : కడపలో ప్రైవేట్ బస్సుల నిర్వాకం.. పెద్ద ఎత్తున గంజాయి తరలింపు!

Ganja Smuggled By Kadapa Private Bus : ఆహార పదార్థాల మాటున గంజాయి (Ganja) సరఫరాకు అడ్డాగా ప్రొద్దుటూరు (Proddutur) లోని ప్రయివేట్ ట్రావెల్స్ మారాయి. మైదుకూరు రోడ్డులోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో (Private Travels Bus) గంజాయి రవాణా చేసినట్లు పోలీసుల నిర్ధారణ చేశారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులతో పాటు పెద్ద ఎత్తున వస్తువుల రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రతిరోజు బస్సుల డిక్కీల్లో పెద్ద ఎత్తున విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి కడపకు వస్తువులు వస్తున్నాయి. పెద్ద ఎత్తున నిషేధిత వస్తువులను అక్రమార్కులు బస్సుల ద్వారా తరలిస్తున్నారు. అధికారులకు మామూళ్లు ఇస్తున్నామనే భావనతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు రెచ్చిపోతున్నారు.

Also Read : సోషల్ మీడియాలో వైసీపీ ఎమ్మెల్సీ న్యూడ్ వీడియో కాల్ హల్చల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారని తేల్చారు. తల, శరీరం పై గాయాలతోనే చనిపోయారని చెబుతున్నారు. 

New Update
AP

Paster Praveen Case Briefing

మిస్టరీగా మారిన హైదరాబాద్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల ఎలా మృతి చెందారో పోలీసులు ఛేదించారు. అత్యాధునిక ఆధారాలు సేకరించడమే కాకుండా.. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్ మార్టం నివేదికలను సమగ్రంగా విశ్లేషించారు. దాని ప్రకారం మార్చి 24న రాజమండ్రికి దగ్గరలో కొంతమూరు దగ్గర పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ లో మృతి చెందారని నిర్ధించారు. ఈ విషయాన్ని ఏలూరు రేంజి ఐజీ అశోక్ కుమార్ వివరించారు.  

బైక్ మీద వెళ్ళడంతో యాక్సిడెంట్..

కేసు వివరాలను తూర్పుగోదావరి జిల్లా పోలీస్ స్టేషన్ లో ఎస్పీ నరసింహ కిశోర్ తో కలిసి ఏలూరు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. పోస్ట్ మార్టం నివేదికలో ప్రవీణ్ మద్యం తాగినట్లు ఉందని...తల, శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని..యాక్సిడెంట్ లో ఇవి తగిలి ఉండొచ్చని చెప్పారు. ఘటనాస్థలంలోనే పాస్టర్ ప్రవీణ్ చనిపోయారని తెలిపారు. ప్రమాదం జరిగే సమయానికి ఆయన 70 కి.మీ వేగంతో నాలుగో గేరులో వెళుతున్నట్టు ఆర్టీఏ అధికారులు చెప్పారని వివరించారు. ప్రవీణ్ మృతిలో అనుమానాలు రేకెత్తడంతో కుటుంబసభ్యులతో పాటూ 92 మంది సాక్షులను విచారించామని చెప్పారు. వారెవరికీ ఒకరితో ఒకరికి పరిచయాలు లేవని...ఆయన రాజమండ్రి వస్తున్నట్టు ప్రవీణ్ భార్య, ఇదే ఊరుకు చెందిన ఆకాశ్, అడపాక జాన్ కు మాత్రమే తెలుసునని తెలిపారు. కుటుంబ సభ్యులు సైతం మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని ఐజీ అశోక్ మకుమార్ చెప్పారు.    

అంతేకాదు పాస్టర్ ప్రవీణ్ కావాలనే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద బయలుదేరారని పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఆయన కొద్ది రోజులు ఉండాల్సి వస్తుందని, పైగా ఆ వూర్లో అతనికి పనులు ఉండడం వలన బైక్ చేతిలో ఉంటే ఉపయోగపడుతుందని..హైదరాబాద్ నుంచి బండి మీద వచ్చారని చెప్పారు. హైదరాబాద్ లో మిత్రుడు ఒకరు బైక్ మీద వెళ్ళొద్దని కూడా చెప్పారని అయినా ప్రవీణ్ వినలేదని అన్నారు. 

today-latest-news-in-telugu | paster praveen | accident | bike 

Also Read: AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

Advertisment
Advertisment
Advertisment