Hyderabad: చిన్నారులకు డబ్బులు పంచిపెడుతున్న మంత్రి మల్లారెడ్డి.. ఎందుకో తెలుసా?

కష్ట పడ్డా.. పాలమ్మిన.. పూలమ్మిన.. సక్సెస్ అయ్యా అంటూ మస్త్ ఫేమస్ అయిన మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు మరో విధంగానూ ఫేమస్ అవుతున్నారు. తన వద్దకు వచ్చిన చిన్నారులకు డబ్బులు పంచి పెడుతున్నారు. 5 రూపాయలు, 10 రూపాయలు కాదండోయ్.. ఏకంగా తలా ఒక 500 రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు.

New Update
Hyderabad: చిన్నారులకు డబ్బులు పంచిపెడుతున్న మంత్రి మల్లారెడ్డి.. ఎందుకో తెలుసా?

Minister Mallareddy Money Distribution: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి(Minister Malla Reddy) బోలా శంకరుడు మాదిరి అంటారు ఆయన గురించి తెలిసిన వారు. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా చేసిపెడతారని టాక్. అందుకే ఆయనకు అంత క్రేజ్. కష్ట పడ్డా.. పాలమ్మిన.. పూలమ్మిన.. సక్సెస్ అయ్యా అంటూ మస్త్ ఫేమస్ అయిన మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు మరో విధంగానూ ఫేమస్ అవుతున్నారు. తన వద్దకు వచ్చిన చిన్నారులకు డబ్బులు పంచి పెడుతున్నారు. 5 రూపాయలు, 10 రూపాయలు కాదండోయ్.. ఏకంగా తలా ఒక 500 రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. పైగా జాగ్రత్తగా ఖర్చు పెట్టండ్రోయ్ అంటూ పిల్లలకు హితవు కూడా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మంత్రి మల్లన్న ఆ చిన్నారులకు డబ్బులు ఎందుకు పంచి పెట్టారు? తలా 500 రూపాయలు ఇవ్వడం వెనకున్న రీజన్ ఏంటి? ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం.. ఓసారి చదివేయండి మరి.

ఏం నడుస్తోంది బాస్ అంటే.. ఇప్పుడంతా వినయాక చవితి సంబరాల టైమ్ నడుస్తోంది బాస్ అంటారు. అవును మరి.. దేశమంతా ఇప్పుడు వినాయక చవితి హాడావుడే నడుస్తోంది. తెల్లారితే వినాయక చవితి. గల్లీ గల్లీకో వినాయక మండపం సిద్ధమైంది. ఇక వినాయక చవితికి పది రోజుల ముందు నుంచే ఆయా సంఘాల వారు చందాల సేకరణ మొదలు పెట్టారు. చిన్న పిల్లలు సైతం చందాలు కోరుతూ ప్రతి గడప తిరుగుతున్నారు.

ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి బోడుప్పల్‌లోని వీరారెడ్డి కాలనీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి మల్లారెడ్డి వచ్చారు. ఇంకేముంది.. ఆయన్ను చూసిన కొందరు పిల్లలు మంత్రి మల్లారెడ్డి వద్దకు వెళ్లారు. 'సార్ రేపు వినాయక చవితి. వినాయకుడిని పెడుతున్నాం. చందా రాయండి సర్.' ఆ పసి పిల్లలు అమాయకపు భక్తితో మల్లన్నను కోరారు. ఇంకేముంది.. అసలే కిందిస్థాయి నుంచి ఎదిగి వచ్చిన మల్లన్నకు ఆ పిల్లల మనసును అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వారు అలా అడగటమే ఆలస్యం.. తన జేబులోంచి నోట్ల కట్ట తీశారు. ఇదిగో తీసుకోండ్రా పిల్లలు అంటూ.. 10, 20 కాదు.. ఏకంగా తలా 500 రూపాయలు ఇచ్చేశారు. అడిగిన వెంటనే కాదనకుండా.. వారికి డబ్బులు ఇచ్చి, వారి ముచ్చట తీర్చారు మంత్రి మల్లన్న. అంతేకాదండోయ్.. ఇచ్నిన డబ్బులను వినాయకుడికి మాత్రమే వినియోగించాలని సూచించారు మంత్రి. ఇక మంత్రి మల్లారెడ్డి తమకు తలా రూ. 500 ఇవ్వడంతో పిల్లలు ఆనందంలో మునిగితేలారు. ఆ ఆనందంలోనే జై మల్లన్న అంటూ పొలిటికల్ స్లోగన్ రేంజ్‌లో నినాదాలు ఇచ్చారు చిన్నారులు. వారి నినాదాలు విని మంత్రి మల్లన్న సైతం మురిసిపోయారు.

అయితే, మంత్రి మల్లారెడ్డి పిల్లలకు డబ్బులు పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కొందరైతే మల్లన్న మనసు పసి పిల్లల మనసులాంటిదే అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

Driving Licence: ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.. అదెలాగంటే..

Congress: మహాలక్ష్మి స్కీమ్‌ ద్వారా నెలకు రూ. 2500..రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు