Health Tips: పొట్ట కరగాలంటే ఈ పండ్లు తినాల్సిందే!

పొట్ట పెరిగితే అనారోగ్యాల ముప్పు కూడా పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. పొట్టను తగ్గించుకొని తిరిగి నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే.. బొప్పాయ,యాపిల్,నల్లద్రాక్ష,నిమ్మరసం లాంటివి తీసుకోవాలని వారు అంటున్నారు.అయితే వీటితో కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

New Update
Health Tips: పొట్ట కరగాలంటే ఈ పండ్లు తినాల్సిందే!

Fruits To Lose Belly Fat: ఈ రోజుల్లో మనం తినే ఆహారాల్లో చాలా వరకూ మైదాతో చేస్తున్నవే ఎక్కువ. దానికి తోడు ఫ్రైలు, రెడీ టూ ఈట్, స్నాక్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మన బాడీలో క్రమంగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అది అంత తేలిగ్గా కరగదు. దాంతో.. పొట్ట రావడం మొదలవుతుంది. పొట్టలోని కండరాలకు కొవ్వు అతుక్కుపోయి.. పెద్ద పొట్ట వస్తుంది. దాంతో.. పనులు చేయడంలో నెమ్మదిస్తాం. అందువల్ల శారీరక శ్రమ తగ్గి.. మరింత బరువు పెరుగుతాం.

ఆహారం తగ్గించుకున్నంత మాత్రాన పని పూర్తవదు. కొవ్వును కరిగించే ఆహారం తప్పక తీసుకోవాలి. మనందరికీ పండ్లు నచ్చుతాయి. ఆ పండ్లలో కొన్ని కొవ్వును కరిగిస్తాయి. వీలు చూసుకొని.. రోజూ వాటిని తింటూ ఉండాలి. రోజుకో రకం పండ్లను తినాలి. మరీ ఎక్కువ కాకుండా… కొద్ది మొత్తంలో తినాలి. ఆ పండ్లేవో తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బొప్పాయి పండుని (Papaya) తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు తగ్గి, సులువుగా బరువు తగ్గుతారు. ఈ పండు ముక్కలపై కాసింత మిరియాల పొడి చల్లుకుని తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఒక 2, 3 నెలలు బొప్పాయిపండుని రోజూ కొద్దికొద్దిగా తిని చూడండి.. తేడా మీకే తెలుస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: పిల్లలలో పోషకాహారలోపానికి గురయ్యే 5 సంకేతాలు!

యాపిల్ (Apple) 2 రకాలుగా బరువు తగ్గిస్తుంది. 1.ఇది ఆకలిని వెయ్యనివ్వదు. అందువల్ల యాపిల్ తిన్నాక మరేదీ తినబుద్ధి కాదు. అందువల్ల స్నాక్స్ జోలికి వెళ్లం. 2. యాపిల్ రోజూ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీని వల్ల త్వరగా బరువు తగ్గుతారు. దాక్ష (Black Grapes) బరువును బాగా తగ్గిస్తాయి. గ్రీన్ ద్రాక్ష కంటే.. నల్ల ద్రాక్ష అయితే ఎక్కువగా బరువు తగ్గించగలదు. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. శరీరంలో చెడు వ్యర్థాలను బయటకు పంపేస్తాయి. వీటిలోని పొటాషియం కారణంగా.. త్వరగా బరువు తగ్గుతారు.

కొవ్వును ఐస్‌క్రీమ్‌లా కరిగించే గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. ఐతే.. నిమ్మరసంలో (Lemon Water) పంచదార వేసుకుంటే మాత్రం బరువు పెరుగుతారు. అందువల్ల నీటిలో నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, అల్లం రసం కలుపుకొని తాగవచ్చు. రోజుకో నిమ్మకాయ చొప్పున 6 నెలలు వాడితే.. బాడీలో కొవ్వు మొత్తం మాయమవుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....

ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం ఆరా తీశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న  ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

 ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో  దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద  చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత  కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు