One Nation-One ID: ఆధార్ కార్డు తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు

ఆధార్ కార్డు లేకుండా ఎవరైన భారతీయులు ఉన్నారంటే వారు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ కూడా తమ అవసరాల కోసం ఆధార్‌కార్డును తప్పనిసరిగా తీసుకుంటారు. అయితే ఆధార్ తరహాలోనే దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తలు చేస్తోంది. వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డును తెచ్చే యోచనలో కేంద్ర విద్యాశాఖ ఉంది.

New Update
One Nation-One ID: ఆధార్ కార్డు తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు

One Nation-One ID: ఆధార్ కార్డు గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ప్రతిఒక్కరికీ ఈ ఆధార్ గుర్తింపు కార్డు ఉండాల్సిందే. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందడం కోసం అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార ఇలా అన్ని రంగాల్లో మన వివరాలు తెలియజేసేందుకు ఆధార్ కార్డు కాపీ సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు లేకుండా ఎవరైన భారతీయులు ఉన్నారంటే వారు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ కూడా ఆధార్‌కార్డును తీసుకుంటారు. అయితే ఆధార్ తరహాలోనే దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తలు చేస్తోంది. వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు (One Nation, One Student ID Card) ను తెచ్చే యోచనలో కేంద్ర విద్యాశాఖ ఉంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు ఇచ్చేటటువంటి ఈ గుర్తింపు నంబర్‌ను ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఏపీఏఏఆర్‌-అపార్‌)గా పిలువనున్నారు.

Also Read: 10th క్లాస్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఖాళీలు ఎన్నంటే..

అయితే ఈ 'అపార్' (APAAR) ఐడీ కార్డులు ఇచ్చే ప్రక్రియను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అపార్ ఐడీ కార్డులు ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. వాస్తవానికి ఈ అపార్ నంబర్ అనేది విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ప్రభుత్వ అలాగే ప్రైవేటు విద్యార్థులకు ఈ అపార్ ఐడీ కార్డును ఇవ్వనున్నారు. ఈ కార్డులో ఆ విద్యార్థికి సంబంధించిన అకడమిక్ జర్నీ, చరిత్ర, విజయాలు అన్ని కూడా నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన సమయంలో విద్యార్థులను ట్రాక్ చేసేందుకు వీలు ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థులకు కొత్త అపార్ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ముందుగా వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని.. ఇందుకోసం వారి సమ్మతి తీసుకోవాలని కేంద్రం అన్ని పాఠశాలలను కోరింది. అలాగే ఈ ఐడీ ప్రాముఖ్యత గురించి చెప్పేందుకు అక్టోబర్ 16-18 మధ్య విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి సమావేశాలు నిర్వహించాలని సూచనలు చేసింది.

మరోవిషయం ఏంటంటే విద్యార్థికి అపార్ ఐడీ కార్డు (APAAR ID Card) ను జారీ చేసేందుకు సమ్మతి తెలిపిన తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా దాన్ని ఉపసంహరించుకోనే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థుల డాటాను రహస్యంగా ఉంచుతామని.. కేవలం ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే పంచుకోవడం అనేది ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ‘వన్‌ నేషన్‌-వన్‌ స్టూడెంట్‌ ఐడీ’ స్కీమ్‌పై ఏఐసీటీఈ చైర్మన్‌ టీజీ సీతారామన్‌ (T G Sitharam) మాట్లాడుతూ ఆపార్‌, నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ దేశంలోని విద్యార్థులందరికీ ఒక క్యూఆర్‌ కోడ్‌ మాదిరిగా పనిచేస్తుందని తెలిపారు. విద్యార్థి నేర్చుకొన్నటువంటి ప్రతి నైపుణ్యం, సాధించిన విజయాలు అందులో ఉంటాయని పేర్కొన్నారు.
Also Read: నీరసంగా మొదలైన దేశీయ మార్కెట్లు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HYD Scam: బంగ్లాదేశ్ లో పుట్టినోళ్లకు హైదరాబాద్ లో బర్త్ సర్టిఫికేట్.. షాకింగ్ స్కామ్ బయటపెట్టిన పోలీసులు!

బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు మనదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్నారు. ఆ చొరబాటుదారులకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంక కదిలింది.

New Update
Two Bangladeshi Nationals Arrested in Hyderabad

Two Bangladeshi Nationals Arrested in Hyderabad

HYD Scam: బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు మనదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్న విషయం చాలాసార్లు రుజువైంది. బంగ్లా సరిహద్దుల్లో ఉన్న భద్రత దళాల కన్నుగప్పి మనదేశంలోకి పలువురు ప్రవేశిస్తున్నారు. అలా వచ్చినవారిలో చాలామంది హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారనే విషయం చాలాసార్లు రుజువైంది. అయితే ఆ అక్రమ చొరబాటుదారులకు స్థానిక బర్త్‌ సర్టిఫికెట్‌ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.బర్త్ సర్టిఫికెట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంక కదిలింది.

ఇది కూడా చదవండి: రాత్రంతా ఏసీ వాడుతున్నారా..అయితే జాగ్రత్త

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం . మహ్మద్‌ హసిబుల్ అనే వ్యక్తి ఢాకా నుంచి అక్రమంగా కోల్‌కతా చేరి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. అయితే ఆయన విషయంలో అనుమానం రావడంతో ఎంక్వయిరీ చేయగా షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. బంగ్లా రాజధాని ఢాకాకు చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ హసిబుల్ నాలుగేళ్ల క్రితం భారత్‌లోకి వచ్చాడు. ఏజెంట్లకు రూ.25 వేలిచ్చి అక్రమంగా పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించాడు. కోల్‌కతాలోని సౌత్రాలో జోవన్ చౌదరి పేరుతో నకిలీ ఆధార్ కార్డు సేకరించాడు. అక్కడే కరాటే శిక్షకుడిగా పని చేస్తూ నెలకు రూ.20 వేల సంపాదనతో జీవనం సాగించాడు. 2023 డిసెంబర్​లో ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ ద్వారా హైదరాబాద్‌ మలక్‌పేట్‌కు చెందిన జయా చౌదరితో పరిచయం పెంచుకున్నాడు. తాను కోల్‌కతా పౌరుడినంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మలక్‌పేటకు మకాం మార్చి ఆన్‌లైన్‌ వస్త్ర వ్యాపారం, ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

ఇదే సమయంలో తనకు  బర్త్‌ సర్టిఫికెట్‌ఇప్పించాలంటూ మలక్‌పేట్‌లోని పాన్‌ దుకాణ యజమాని మహ్మద్ ముఖీద్‌ను మహ్మద్‌ హసిబుల్‌ కోరాడు. అతడు కోల్‌కతా నుంచే వచ్చాడని నమ్మిన పాన్‌షాప్‌ యజమాని, చాదర్ ఘాట్‌లోని డీటీపీ ఆపరేటర్ సాయికిరణ్‌ను పరిచయం చేశాడు. అతడు చంచల్‌గూడలోని రజనీకాంత్‌ను సంప్రదించమని సూచించాడు. రజనీకాంత్‌ ద్వారా నార్సింగి మున్సిపాలిటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సుధీర్‌కుమార్‌ను మహ్మద్ హసిబుల్ కలిశాడు. రూ.15 వేలు కమీషన్ ఇచ్చి జోవన్ చౌదరి పేరుతో  బర్త్‌ సర్టిఫికెట్‌ పొందాడు. వాటి ఆధారంగా ఓటరు గుర్తింపు కార్డు సైతం సంపాదించాడు.  బర్త్‌ సర్టిఫికెట్‌, ఓటరు ఐడీ రెండు ఉండడంతో ఆధార్ కార్డు పొందేందుకు మహ్మద్‌ హసిబుల్‌ సిద్ధమయ్యాడు.

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

ఇదిలా ఉండగానే 3 నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా చేరి టూరిస్ట్ గైడ్‌గా పని చేస్తున్న రోహన్‌షాతో మహ్మద్‌ హసిబుల్‌కు పరిచయం ఏర్పడింది. తన భార్య గర్భంతో ఉందని సహకరించాలని కోరటంతో రోహన్ షాను హైదరాబాద్‌ రప్పించిన హసిబుల్‌ తన ఇంట్లో వసతి కల్పించాడు. అతడికి నకిలీ ఆధార్ కార్డు ఇప్పించాడు. హసన్‌, రోహన్‌ షా భారత పౌరులుగా చెలామణి అయ్యేందుకు పాస్‌పోర్ట్స్ పొందాలని నిర్ణయించుకొని నకిలీ ఆధార్‌ కార్డులతో దరఖాస్తు చేసుకున్నారు. పోలీసుల పరిశీలనలో అవి నకిలీవిగా తేలటంతో మధ్య మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్ ఖలీల్ పాషా బృందం రంగంలోకి దిగింది. అసలు వారికి ఆ నకిలీ కార్డ్సు ఎలా వచ్చాయి అనే విషయంలో కూఫీ లాగడం మొదలు పెట్టాయి.

ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి

బంగ్లాదేశీయుడి నుంచి రాబట్టిన సమాచారంతో పాన్ దుకాణదారుడిని పోలీసులు ప్రశ్నించటంతో మిగిలిన వారి ప్రమేయం వెలుగు చూసింది. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయానికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు, తమకు బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలని సుధీర్‌ని కోరటంతో అంగీకరించాడు. దీంతో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కోసం మలక్‌పేట్‌ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో నార్సింగి మున్సిపాలిటీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సుధీర్‌ కుమార్‌, ఏజెంట్లు మహ్మదులీజ్‌, టి.సాయికిరణ్‌, రజనీకాంత్‌, బంగ్లా దేశస్థులు మహ్మద్‌ హసిబుల్‌, రోహన్‌ ఉన్నారు. నిందితుల నుంచి 7 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, నకిలీ ఆధార్, ఓటర్‌ గుర్తింపు, బర్త్‌ సర్టిఫికెట్లు, బంగ్లా పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు