Mannanur: మన్ననూర్‌ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరోసారి అస్వస్థత

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల పరిధిలోని మన్ననూర్‌ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకొని సృహ కోల్పోయిన 14 మంది విద్యార్థినులను హాస్టల్ సిబ్బంది స్థానిక అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

New Update
Mannanur: మన్ననూర్‌ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరోసారి అస్వస్థత

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల పరిధిలోని మన్ననూర్‌ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకొని సృహ కోల్పోయిన 14 మంది విద్యార్థినులను హాస్టల్ సిబ్బంది స్థానిక అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం నాగర్‌ కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గత 15 రోజుల క్రితం ఇదే పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆ విషయాన్ని మర్చిపోకముందే మరోసారి అదే ఆశ్రమ పాఠశాలలో మరొసారి ఫుడ్ పాయిజన్‌ కలకలం రేగడం చర్చనీయంశంగా మారింది.

అంతకు ముందు ఏం జరిగిందంటే..

నాగర్‌ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌ మండల పరిధిలోని మన్ననూరులో దారుణం చోటు చేసుకుంది. మన్ననూరులోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్‌ వల్ల సుమారు 40 మంది విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన హాస్టల్‌ సిబ్బంది బాధితులను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థునుల హాస్టల్‌ ముందు బైఠాయించారు.

హాస్టల్‌ నిర్వహకులు విద్యార్థునులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పైసలకు కక్కుర్తిపడి నాసిరకమైన భోజనం పెట్టడం వల్ల విద్యార్థినుల ప్రాణాలపైకి వచ్చిందన్నారు. హాస్టల్‌లోని యువతుల ఫుడ్‌ కోసం ప్రభుత్వం ఫండ్స్‌ రిలీజ్‌ చేసినా.. హాస్టల్ సిబ్బంది మాత్రం డబ్బులను పక్కదోవ పట్టిస్తూ కుళ్లిపోయిన టమాటాలు, గుడ్లతో పాటు ఇతర నాసిరక నిత్యావసర సరకులను తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డిస్తున్నారన్నారు. దీంతో ఆ భోజనం తిన్న విద్యార్థునులు అస్వస్థతకు గరువుతున్నారని వెల్లడించారు.

మరోవైపు అస్వస్థతకు గురైన విద్యార్థునుల తల్లిదండ్రులకు హాస్టల్‌ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో హుటా హుటీన అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న యువతుల ఫెరెండ్స్‌ విద్యార్థునుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు కొందరు విద్యార్థునులను మహబూబ్ నగర్‌లోని ప్రైవేట్ ఆస్సత్రికి తరలించారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్‌ సిబ్బందిపై కేసు నమోదు చేసుకున్నారు. హాస్టల్‌ సిబ్బంది సరుకులను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ALSO READ: దేశ రాజధానిలో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అరెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు