Flight: విమానంలో ప్రయాణికుడు ఆత్మహత్యయత్నం..ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

థాయ్‌ ల్యాండ్‌ కు చెందిన ‘ఇవా ఎయిర్‌లైన్స్‌’ ఫ్లైట్‌లో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది.

New Update
Flight: విమానంలో ప్రయాణికుడు ఆత్మహత్యయత్నం..ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

థాయ్‌లాండ్ నుండి UKకి వెళ్లే విమానాన్ని ఒక ప్రయాణికుడు విమానం బాత్రూంలో ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. బ్యాంకాక్ నుండి EVA ఎయిర్ ఫ్లైట్ BR67 శుక్రవారం లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లోకి దిగే క్రమంలో ఓ ప్రయాణికుడు బాత్రూం నుంచి ఎంతసేపటికీ బయటకు రాకపోవడాన్ని క్యాబిన్‌ సిబ్బంది గమనించారు.

దీంతో వారు బాత్రూం తలుపులు ఎంత కొట్టినప్పటికీ అతను తలుపు తీయకపోవడంతో సిబ్బందికి ఏదో అనుమానంగా అనిపించింది. వెంటనే తలుపులు తెరిచి చూడగా అతను ఆత్మహత్యకు పాల్పడుతూ కనిపించాడు.వెంటనే అతడిని బయటకు తీసుకుని వచ్చి విమాన సిబ్బందితో పాటు విమానంలో ఉన్న ఓ డాక్టర్ ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు.

ఈ క్రమంలో విమానం హిత్రూ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ అయ్యింది. ప్రయాణికుడిని తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అయితే దీని గురించి ఎయిర్‌ లైన్‌ సిబ్బంది ధృవీకరించింది కానీ ప్రయాణికుడి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది.

Also read: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. మూడురోజుల్లో భారీ వర్షాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment