Breaking: సెక్రటేరియేట్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు! మధ్య ప్రదేశ్ సెక్రటేరియేట్ లో భారీ అగ్ని ప్రమాదంచోటు చేసుకుంది. శనివారం ఉదయం భవనంలో నుంచి భారీగా మంటలు, పొగ రావడం గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. By Bhavana 09 Mar 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Fire Accident : మధ్య ప్రదేశ్(Madhya Pradesh) సెక్రటేరియేట్(Secretariate) లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. శనివారం ఉదయం భవనంలో నుంచి భారీగా మంటలు, పొగ రావడం గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు భారీ ఎత్తున ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సచివాలయం(Sachivalayam) లోని మూడో అంతస్తు నుంచి మంటలు ఎగిసి పడుతుండడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలను, పొగను చూసిన స్థానికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. భవనం లోపల మంటలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. Also Read : ఖమ్మంలో బస్సు బోల్తా…15 మంది ప్రయాణికులు! #secratariate #madhya-pradesh #fire-accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి