కన్నకొడుకుల గొంతు కోసిన కసాయి తండ్రి.. రెండేళ్ల పసిప్రాణం బలి

కన్నతండ్రే మైనర్ పిల్లల గొంతు కోసి చంపిన ఘోరమైన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కుటుంబ గొడవల్లో భాగంగా ఈ దాడిచేయగా రెండేళ్ల పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. ఐదేళ్ల అబ్బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నిందితుడు అదే కత్తితో గొంతు కోసుకుని ఆస్పత్రిలో చేరాడు.

New Update
కన్నకొడుకుల గొంతు కోసిన కసాయి తండ్రి.. రెండేళ్ల పసిప్రాణం బలి

ఈ మధ్య కాలంలో కొంతమంది మనుషులు ఊహించని రీతిలో క్రూర మృగాలుగా మారిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీసేస్తున్నారు. వయసు, ప్రాంతంతో సంబంధం లేకుండా బహిరంగంగానే కత్తులతో దాడిచేసి చంపేస్తున్నారు. ఇలాంటి దారుణమైన ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని వజీర్ పూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున ఇద్దరు మైనర్ కుమారుల గొంతు కోసి హతమార్చాలని ఒక తండ్రి ప్రయత్నించాడు. ఆ తరువాత అదే కత్తితో తాను కూడా గొంతు కోసుకున్నాడు.

ఢిల్లీలోని వజీర్ పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్ నగర్ సమీపంలో జేజే కాలనీలో ఇన్వర్టర్ మెకానిక్ గా పని చేసే 36 ఏళ్ల నిందితుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం క్షణికావేశంతో తన ఇద్దరు కొడుకుల గొంతు కోసి చంపేయడానికి ప్రయత్నించాడు. ఆ తరువాత తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఆ సమయంలో అతడి భార్య ఇంట్లో లేదు. ఈ ఘటనలో రెండేళ్ల వయస్సున్న చిన్న కొడుకు ప్రాణాలు కోల్పోగా, ఐదేళ్ల వయస్సున్న పెద్ద కుమారుడు, ఈ దారుణానికి పాల్పడిన కన్నతండ్రి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఐదేళ్ల కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Also read :తండ్రి ఉద్యోగం కోసం తనయుడి దారుణం.. కిరాయి గుండాలతో కలిసి

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి నిందితుడు ఎందుకు పాల్పడ్డాడనే విషయంపై కుటుంబ సభ్యులను ప్రశ్నించగా ఈ దారుణానికి కారణం కుటుంబ గొడవలే అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిపై హత్య, హత్యా ప్రయత్నం, ఆత్మహత్య ప్రయత్నం, తదితర నేరాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

దుబాయ్ నుంచి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి భార్య రజియా చంపేసింది. బాడీని ముక్కలు చేసి భర్త తెచ్చిన బ్యాగ్‌లోనే ప్యాక్ చేసి ఊరికి 55KM దూరంలో పడేశారు. ఎయిర్‌పోర్ట్‌లో QRకోడ్‌ స్టికర్ బ్యాగ్‌పై ఉంది. దానితోనే పోలీసులు కేసు చేధించారు. వారిని అరెస్ట్ చేశారు.

New Update
Uttar Pradesh Deoria

Uttar Pradesh Deoria

విదేశాల నుంచి తిరిగొచ్చిన భర్తను భార్య చంపి ముక్కలు ముక్కలు చేసింది. చివరికి అతను తెచ్చిన బ్యాగ్‌లో ప్యాక్ చేసి 55 కిలో మీటర్ల దూరంలో వేసింది. ఎంత పెద్ద క్రైమ్ చేసిన ఏదో ఓ చిన్న తప్పుతో దొరికిపోతారనే పోలీసుల మాట నిజమైంది. రజియా తన అక్రమ సంబంధానికి కొనసాగించేందుకు భర్త అడ్డు తొలగించుకోవాలని చూసింది. పక్కా ప్లాన్‌తో లవర్, అతని మేనల్లుడితో కలిసి భర్త నౌషాద్ అహ్మద్‌‌ను చంపి సూట్‌కేస్‌లో పెట్టింది. దాన్ని ఊరికి 55 కిలో మీటర్ల దూరంలో పడేశారు.

Also read: Woman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఇది చోటుచేసుకుంది. పది రోజుల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిని అతని భార్య, ఆమె లవర్ హత్య చేశారు. బాధితుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. దాన్ని ఇంటి నుండి 55 కిలోమీటర్ల దూరంలో పడేశారు. తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్ఖౌలి గ్రామంలో ఏప్రిల్ 21న తన పొలంలో అనుమానాస్పద బ్యాగ్ చూసి రైతు జితేంద్ర గిరి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి బ్యాగ్‌ తెరిచి చూస్తే.. ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన మొండెం, కాళ్ల కనిపించాయి. తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ఉంది. మృతదేహం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. ఆ బ్యాగ్‌కు ఒక క్యూర్ కోడ్ ఉంది. అది ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ చెక్కింగ్ సమయంలో వేసింది. ఈ క్యూఆర్ కోడ్‌తో పోలీసులు కేసు ఛేదించారు. 

Also read: ACB caught: అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?

విమానాశ్రయ అధికారులతో బార్‌కోడ్‌ను ట్రాక్ చేస్తే మృతుడు మెయిల్ పోలీస్ స్టేషన్‌లోని భటౌలి గ్రామానికి చెందిన నౌషాద్ అహ్మద్‌(38)గా గుర్తించారు. పోలీసులు అతని ఇంటికి వెళ్లినప్పుడు భార్య పోలీసుల ముందే భర్త కనిపించడం లేదని ఏడ్చింది. పోలీసులు ఇంట్లో వెతికగా.. రక్తపు మరకలతో ఉన్న మరో సూట్‌కేస్ దొరికింది. ఆమె ఆస్కార్ ఫర్మామెన్స్‌పై పోలీసులకు అనుమానం వచ్చి వారి స్టైల్లో విచారించారు. దీంతో రజియా, ఆమె ప్రేమికుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. భర్తకు స్కెచ్ వేసిన రజియా అతను దుబాయ్ నుంచి తెచ్చిన అదే బ్యాగ్‌ వాడి దొరికిపోయింది. ఆమె మేనల్లుడు రుమాన్‌లో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తు్న్నాడని హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏం అయ్యింది ఈ భార్యలకు.. మానవ విలువలు మట్టికలిసిపోతున్నాయా? నెల వ్యవధిలోనే ఇది ఐదో హత్య. మీరట్‌లో సౌరభ్, అమిత్ కశ్యప్, బరేలీలో కేహర్ సింగ్, హర్యానాలో ప్రవీణ్.. ఇప్పుడు నౌషాద్ అహ్మద్‌. వీరంతా భార్యల  వివాహేతర సంబంధానికి బలైన బాధితులు. ఈ వార్తలు విని పెళ్లీడుకు వచ్చిన యువకులు వివాహం చేసుకోవాలంటే భయంతో వణుకుతున్నారు. బతికుంటే జీవితాంతం.. ఇలా సింగిల్‌గానైనా ఉండొచ్చని అనుకుంటున్నారు.

Also read: Hydrogen Bomb: ప్రపంచానికి మరో విధ్వంసాన్ని పరిచయం చేసిన చైనా

(latest-telugu-news | crime news | wife cuts husband dead body)

 

 

Advertisment
Advertisment
Advertisment