Visakha : పెంపుడు కుక్క కాటుకు తండ్రి, కొడుకు మృతి! AP: విశాఖ జిల్లా భీమిలిలో నరసింగరావు, ఆయన కొడుకు భార్గవ్ను పెంపుడు కుక్క కరిచింది. అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ను వారు తీసుకున్నారు. అప్పటికే మెదడు, కాలేయానికి రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ తండ్రి, కొడుకు మృతి చెందారు. By V.J Reddy 26 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Dog Bite : విశాఖ జిల్లా భీమిలి (Bheemili) లో దారుణం జరిగింది. పెంపుడు కుక్క (Pet Dog) కరవడంతో తండ్రీ, కొడుకు మృతి చెందారు. వారం కిందట నరసింగరావు, ఆయన కొడుకు భార్గవ్ను పెంపుడు కుక్క కరిచింది. కరిచిన తర్వాత రెండు రోజులకు కుక్క చనిపోయింది. భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావు కాలు మీద కుక్క కరిచింది. అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు తండ్రి, కొడుకు. అప్పటికే మెదడు, కాలేయానికి రేబిస్ (Rabies) సోకడంతో చికిత్స పొందుతూ తండ్రి, కొడుకు మృతి చెందారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. Also Read : వారికి రుణమాఫీ జరగదు.. రైతులకు రేవంత్ సర్కార్ షాక్! #rabies #pet-dog #dog-bite #bheemili సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి