బ్యాగ్‌లో రాళ్లను తెచ్చి, ముఖానికి గుడ్డ కట్టి..' రాళ్లు రువ్విన..బయటకొచ్చిన వీడియో!

శంభు సరిహద్దు వద్ద రైతులు అల్లర్లు సృష్టిస్తున్న చిత్రాలు,వీడియోలను విడుదల చేశారు.కొంతమంది రైతులు పోలీసులపై రాళ్లు రువ్వడం కనిపించింది. సరిహద్దు దాటకుండా రైతులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తుండగా, ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు.

New Update
బ్యాగ్‌లో రాళ్లను తెచ్చి, ముఖానికి గుడ్డ కట్టి..' రాళ్లు రువ్విన..బయటకొచ్చిన వీడియో!

Farmers Protest: హర్యానా (Haryana)  పోలీసులు అంబాలాలోని శంభు సరిహద్దు వద్ద రైతులు (Farmers) అల్లర్లు సృష్టిస్తున్న చిత్రాలు, వీడియోలను విడుదల చేశారు, ఇందులో కొంతమంది రైతులు పోలీసులపై రాళ్లు రువ్వడం(Pelting Stones)  కనిపించింది. సరిహద్దు దాటకుండా రైతులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తుండగా, కొందరు ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. ఈ వీడియోలు, చిత్రాలను విడుదల చేసిన పోలీసులు దాడులకు పాల్పడిన వారిని గుర్తించడం లో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఫిబ్రవరి 13, 14న రైతులు ఢిల్లీకి పాదయాత్ర( Delhi Chalo)  చేసేందుకు వెళ్తున్న సమయంలో తీసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.ఆ సమయంలో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో మరోపక్కన ఉనన యువకులు పోలీసుల పై రాళ్లు రువ్వుతూ కనిపించారు. రాళ్లను పోలీసులపైకి విసురుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

18 మంది పోలీసులు సహా 25 మంది భద్రతా సిబ్బంది

ఇది ముందుగా అనుకున్న దాడి అని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ముందుగానే ఆందోళనకారులు ఓ క్యారీ బ్యాగ్ లో రాళ్లను తీసుకుని వచ్చారు. రాళ్లను విసిరే సమయంలో వారు తమ ముఖాలను మాస్క్‌ లతో కవర్‌ చేశారు. భద్రతా బలగాలపై రాడ్లు, కర్రలు ప్రయోగించడంతోపాటు రాళ్లు రువ్వారు.

రాళ్లు రువ్విన నిరసనకారులను గుర్తించాలని స్థానిక ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము.'' ఈ ఘటనలో 18 మంది హర్యానా పోలీసులతో సహా 25 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని ఆయన చెప్పారు.

Also read:  కాయలు మాత్రమే కాదు.. ఆకులు కూడా ఔషదాలే.. కాజీ నిమ్మ ప్రత్యేకతలివే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి

ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు.

author-image
By B Aravind
New Update

ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. ఆ తర్వాత స్థానికులు వీరయ్యను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లిక్కర్‌ సిండికేట్‌ విషయంలో గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Also Read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

 

Advertisment
Advertisment
Advertisment