Delhi : ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతు సంఘాలు.. బుధవారం ఢిల్లీకి పయనం!

పంటకు కనీస మద్దతు ధర పై ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి వ్యవహరిస్తుందని రైతు సంఘాలు తెలిపాయి. నాలుగో సారి కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలను తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు వివరించాయి.

New Update
Delhi : ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతు సంఘాలు.. బుధవారం ఢిల్లీకి పయనం!

Farmers Protest : పంటకు కనీస మద్దతు ధర పై ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి వ్యవహరిస్తుందని రైతు సంఘాలు(Farmers)  తెలిపాయి. నాలుగో సారి కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలను తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు వివరించాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల ముందు ఒక మాట మాట్లాడగా.. మీడియా ముందుకు వచ్చి మరో మాట మాట్లాడిందని తెలిపాయి.

అందుకే వారి చర్యకు నిరసనగా ఫిబ్రవరి 21 న ఢిల్లీ(Delhi) కి పయనమవుతున్నట్లు రైతు సంఘాల(Farmer's Union) నాయకులు తెలిపారు. మాతో చర్చలు జరిపినప్పుడు అన్ని పంటలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు. అంతే కాకుండా ఎమ్‌ఎస్‌పీ(MSP) కోసం ఏకంగా 1. 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని మంత్రి వివరించారు. కానీ మీడియా ముందుకు వచ్చి వేరే మాట చెప్పారు. అందుకే మేం కేంద్రం ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని రైతు సంఘాల నాయకులు వివరించడమే కాకుండా.. ఫిబ్రవరి 21న ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు కేంద్రం అనుమతించాలని వారు కోరారు.

ఢిల్లీకి పాదయాత్ర చేసి ఆందోళన కొనసాగిస్తామని రైతు నేతలు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కేంద్రం అధికారులు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. రైతు సంఘాల నాయకులు తమ విశ్లేషణకు అంగీకారం తెలిపారని అధికారులు వివరించారు. కానీ రైతు సంఘాల నాయకులు మాత్రం అధికారులు చెబుతున్న దానిలో నిజం లేదని వివరించారు. అందుకే కేంద్ర ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.

Also Read : Vastu Tips: ఈ మొక్కను క్యాష్‌ కౌంటర్‌ వద్ద పెట్టండి.. ఇక డబ్బే డబ్బు..!

బుధవారం రైతు సంఘాలు ఢిల్లీకి పయనమైన నేపథ్యంలో మరోసారి సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవచ్చని అధికారులు భావిస్తున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టబద్ధమైన హామీ అంశంపై ఆదివారం చండీగఢ్‌లో రైతు నాయకులు, ముగ్గురు కేంద్ర మంత్రుల మధ్య నాలుగో రౌండ్ సమావేశం జరిగింది. మరో నాలుగు పంటలకు ఎమ్మెస్పీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

వరి, గోధుమలతో పాటు కందులు, ఉసిరి, మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా ఎంఎస్‌పీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, ఇందుకోసం రైతులు ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌, సీసీఐలతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.ప్రభుత్వం ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని రైతులు నిర్ణయించారు. ఫిబ్రవరి 21లోగా సమాధానం ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, రైతు సంఘాలు ఇంకా ఉద్యమం ముగింపును ప్రకటించలేదు. అప్పటి నుండి వారు శంభు సరిహద్దు, ఖనౌలీ సరిహద్దుల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్దమయ్యారు.

మరి రైతు సంఘాల నిర్ణయంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read : జమ్మూ కశ్మీర్ లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలు పై 5.5 తీవ్రత నమోదు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment